NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / IT Employees: ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం.. మరోసారి వేతనాల పెంపు వాయిదా
    తదుపరి వార్తా కథనం
    IT Employees: ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం.. మరోసారి వేతనాల పెంపు వాయిదా
    ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం.. మరోసారి వేతనాల పెంపు వాయిదా

    IT Employees: ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం.. మరోసారి వేతనాల పెంపు వాయిదా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 06, 2025
    10:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికం ఫలితాలను త్వరలో వెల్లడించనున్నాయి.

    మొదటి త్రైమాసికంతో పోలిస్తే డిమాండ్ కాస్త పెరిగింది. అందువల్ల ఈ కంపెనీలు మంచి ఫలితాలు సాధిస్తాయని అంచనా వేస్తున్నారు.

    అయితే ఈ క్రమంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్ నుండి ఒక షాకింగ్ ప్రకటన వచ్చింది. భారతదేశంలో ఐటీ రంగం డిమాండ్ విషయంలో సుస్థిరంగా ఉంది.

    కరోనా సమయంలో ఇతర రంగాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురైనా ఐటీ రంగం మాత్రం అభివృద్ధి చెందింది.

    వర్క్ ఫ్రం హోం విధానం, కొత్త నియామకాలు వంటి అంశాలతో ఆ కాలంలో ఐటీ రంగం నిరంతర అభివృద్ధిని సాధించింది.

    Details

    ఇబ్బందుల్లో ఉద్యోగులు

    అయితే 2023-24 సంవత్సరంలో ఐటీ రంగం ఎదుర్కొన్న అనిశ్చితి, అమెరికాలో ఆర్థిక మందగమనంతో పాటు, పశ్చిమాసియా దేశాలలో ఆర్థిక అనిశ్చితి వంటివి సంక్షోభ పరిస్థితులను సృష్టించాయి.

    ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, ఖర్చులను తగ్గించడం, వేతనాలు పెంచకోవడం వంటి చర్యలను తీసుకున్నాయి.

    ఇన్ఫోసిస్ కూడా ఇదే విధంగా వేతనాలు పెంచకుండానే వాయిదా వేసింది.

    ప్రతి త్రైమాసికంలోనూ వేతనాల పెంపు ఆశిస్తుండగా, ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి వాయిదా వేసింది.

    Details

    అంతర్జాతీయ డిమాండ్ తగ్గడమే కారణం

    ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేశ్ సంఘ్‌రాజ్ కా ప్రకారం, 2024లో జనవరిలో కొద్దిమంది, ఏప్రిల్‌లో మిగతా ఉద్యోగులకు వేతనాల పెంపు అమలు చేయనున్నారని తెలిపారు.

    వాస్తవానికి, ఈ ఏడాది ప్రారంభంలోనే వేతనాల పెంపు ఇవ్వాలని ప్రణాళికలు ఉండగా, ఆర్థిక అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ డిమాండ్ తగ్గడం ఈ నిర్ణయానికి కారణమైంది.

    ఇతర ఐటీ కంపెనీలు కూడా ఇదే విధంగా తమ వేతనాల పెంపును వాయిదా వేసుకున్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇన్ఫోసిస్
    వ్యాపారం

    తాజా

    APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో 600 విద్యుత్తు బస్సులు ఏపీఎస్ఆర్టీసీ
    Amaravati: అమరావతిలో గూగుల్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. 143 ఎకరాల భూమి కేటాయించనున్న ప్రభుత్వం  అమరావతి
    Elon Musk: 80శాతం మద్దతు.. మస్క్ కొత్త పార్టీకి 'ది అమెరికా పార్టీ' గా నామకరణం? ఎలాన్ మస్క్
    UPSC exams: ఆధార్‌ ధృవీకరణతో యూపీఎస్‌సీ దరఖాస్తు మరింత సులువు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్

    ఇన్ఫోసిస్

    Infosys: నెలకు 10 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హుకుం  బిజినెస్
    Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్  తాజా వార్తలు
    Narayana Murthy : డీప్‌ఫేక్ వీడియోలపై హెచ్చరించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. నేను అలా అనలేదు, ఎవరూ నమ్మకండి  డీప్‌ఫేక్‌
    Infosys-Wipro-Tcs: విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లలో 63,759 మంది ఉద్యోగాలను కోల్పోయారు  విప్రో

    వ్యాపారం

    NSE: నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్.. తెలుగు సహా 11 భాషల్లో వెబ్ సేవలు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్
    Stock Market: అమెరికా ఎన్నికల ఫలితాల ప్రభావం.. లాభాల్లో దేశీయ సూచీలు స్టాక్ మార్కెట్
    Elon Musk: మూడేళ్ల తర్వాత 300 బిలియన్‌ మార్క్ దాటిన ఎలాన్‌ మస్క్‌ సంపద ఎలాన్ మస్క్
    Intel: ఇంటెల్ ఉద్యోగులకు శుభవార్త.. పాత సదుపాయాల పునరుద్ధరణ బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025