
IT Employees: ఇన్ఫోసిస్ షాకింగ్ నిర్ణయం.. మరోసారి వేతనాల పెంపు వాయిదా
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశంలోని ప్రముఖ ఐటీ కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మూడో త్రైమాసికం ఫలితాలను త్వరలో వెల్లడించనున్నాయి. మొదటి త్రైమాసికంతో పోలిస్తే డిమాండ్ కాస్త పెరిగింది. అందువల్ల ఈ కంపెనీలు మంచి ఫలితాలు సాధిస్తాయని అంచనా వేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే రెండో అతిపెద్ద ఐటీ సంస్థ అయిన ఇన్ఫోసిస్ నుండి ఒక షాకింగ్ ప్రకటన వచ్చింది. భారతదేశంలో ఐటీ రంగం డిమాండ్ విషయంలో సుస్థిరంగా ఉంది. కరోనా సమయంలో ఇతర రంగాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురైనా ఐటీ రంగం మాత్రం అభివృద్ధి చెందింది. వర్క్ ఫ్రం హోం విధానం, కొత్త నియామకాలు వంటి అంశాలతో ఆ కాలంలో ఐటీ రంగం నిరంతర అభివృద్ధిని సాధించింది.
Details
ఇబ్బందుల్లో ఉద్యోగులు
అయితే 2023-24 సంవత్సరంలో ఐటీ రంగం ఎదుర్కొన్న అనిశ్చితి, అమెరికాలో ఆర్థిక మందగమనంతో పాటు, పశ్చిమాసియా దేశాలలో ఆర్థిక అనిశ్చితి వంటివి సంక్షోభ పరిస్థితులను సృష్టించాయి. ఈ నేపథ్యంలో అనేక కంపెనీలు ఉద్యోగులను తొలగించడం, ఖర్చులను తగ్గించడం, వేతనాలు పెంచకోవడం వంటి చర్యలను తీసుకున్నాయి. ఇన్ఫోసిస్ కూడా ఇదే విధంగా వేతనాలు పెంచకుండానే వాయిదా వేసింది. ప్రతి త్రైమాసికంలోనూ వేతనాల పెంపు ఆశిస్తుండగా, ఇప్పుడు 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికానికి వాయిదా వేసింది.
Details
అంతర్జాతీయ డిమాండ్ తగ్గడమే కారణం
ఇన్ఫోసిస్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ జయేశ్ సంఘ్రాజ్ కా ప్రకారం, 2024లో జనవరిలో కొద్దిమంది, ఏప్రిల్లో మిగతా ఉద్యోగులకు వేతనాల పెంపు అమలు చేయనున్నారని తెలిపారు. వాస్తవానికి, ఈ ఏడాది ప్రారంభంలోనే వేతనాల పెంపు ఇవ్వాలని ప్రణాళికలు ఉండగా, ఆర్థిక అనిశ్చితి కారణంగా అంతర్జాతీయ డిమాండ్ తగ్గడం ఈ నిర్ణయానికి కారణమైంది. ఇతర ఐటీ కంపెనీలు కూడా ఇదే విధంగా తమ వేతనాల పెంపును వాయిదా వేసుకున్నాయి.