Page Loader
20 నగరాల్లో జియో, హరిద్వార్‌లో ఎయిర్ టెల్ 5G సేవలు ప్రారంభించాయి
జియో 5G నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 277 నగరాల్లో ఉంది

20 నగరాల్లో జియో, హరిద్వార్‌లో ఎయిర్ టెల్ 5G సేవలు ప్రారంభించాయి

వ్రాసిన వారు Nishkala Sathivada
Feb 22, 2023
03:51 pm

ఈ వార్తాకథనం ఏంటి

రిలయన్స్ జియో తన 5G సేవలను టిన్సుకియా, భాగల్పూర్, మోర్ముగావ్, రాయచూర్, ఫిరోజాబాద్, చంద్రపూర్‌తో సహా మరో 20 నగరాల్లో ప్రారంభించింది. ఎయిర్ టెల్ తన 5G నెట్‌వర్క్‌ను హరిద్వార్‌తో సహా మరిన్ని ప్రాంతాలలో విడుదల చేసింది. జియో డిసెంబర్ 2023 నాటికి భారతదేశంలో 5G సేవలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం '5G అప్‌గ్రేడ్' డేటా ప్లాన్‌ను ప్రకటించింది. ఎయిర్‌టెల్ కూడా తన 5G సేవలను వేగంగా విస్తరిస్తోంది, మార్చి 2024 నాటికి దేశం మొత్తాన్ని కవర్ చేయాలని భావిస్తోంది. ఎయిర్ టెల్ 5G Plus ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, జోధ్‌పూర్, అజ్మీర్, అల్వార్, బికనీర్, రాజస్థాన్‌లోని భిల్వారాలో అందుబాటులోకి వచ్చింది.

జియో

ప్రస్తుతం జియో 5G నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 277 నగరాల్లో అందుబాటులో ఉంది

ఎయిర్ టెల్ ఇటీవలే 5G సేవలను పశ్చిమ బెంగాల్‌లోని బెర్హంపూర్, రాయ్‌గంజ్, దుర్గాపూర్, బాలూర్‌ఘాట్, అసన్‌సోల్, మెదినీపూర్, జల్‌పైగురి, డార్జిలింగ్, ఇస్లాంపూర్, ఖరగ్‌పూర్‌తో సహా 15 నగరాల్లో ప్రారంభించింది. జియో True 5G గుజరాత్‌లోని గాంధీధామ్; అస్సాంలోని టిన్సుకియా, బొంగైగావ్, ఉత్తర లఖింపూర్, శివసాగర్, బీహార్‌లోని భాగల్పూర్, కతిహార్. మహారాష్ట్రలోని చంద్రపూర్, ఇచల్‌కరంజి; దాద్రా నగర్ హవేలీ, డామన్ డయ్యులోని డయ్యూ, జార్ఖండ్‌లోని బొకారో స్టీల్ సిటీ, డియోఘర్, హజారీబాగ్. కర్ణాటకలోని రాయచూరు, మధ్యప్రదేశ్‌లోని సాత్నా, మణిపూర్‌లో తౌబాల్, గోవాలోని మోర్ముగో. ఉత్తరప్రదేశ్‌లోని ఫైజాబాద్, ఫిరోజాబాద్, ముజఫర్‌నగర్‌లకు జియో 5G సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం జియో 5G నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా 277 నగరాల్లో అందుబాటులో ఉంది.