NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / EPFO 3.0: ఈపీఎఫ్‌ఓ 3.0 వచ్చేస్తోంది.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    EPFO 3.0: ఈపీఎఫ్‌ఓ 3.0 వచ్చేస్తోంది.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ
    EPFO 3.0: ఈపీఎఫ్‌ఓ 3.0 వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

    EPFO 3.0: ఈపీఎఫ్‌ఓ 3.0 వచ్చేస్తోంది.. కీలక వివరాలు వెల్లడించిన కేంద్రమంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 19, 2025
    09:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) డిజిటల్ రంగంలో పెద్ద ఎత్తున మార్పులను చేపట్టనుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ వెల్లడించారు.

    ఈపీఎఫ్‌ఓ 3.0 పేరుతో తీసుకురానున్న కొత్త వెర్షన్‌ ద్వారా సుమారు 9 కోట్ల మంది సభ్యులకు మెరుగైన సేవలు లభించనున్నాయని తెలిపారు.

    మే లేదా జూన్‌ నాటికి ఈ తాజా వెర్షన్‌ అందుబాటులోకి రానుందని చెప్పారు. ఈ సందర్భంగా 'పీటీఐ'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక కీలక విషయాలను వెల్లడించారు.

    ఈపీఎఫ్‌ఓ వెర్షన్‌ 3.0 ద్వారా సేవలను మరింత సులభతరం చేయనున్నామని మంత్రి పేర్కొన్నారు.

    ఆటోమేటెడ్ క్లెయిమ్ సెటిల్‌మెంట్లు,డిజిటల్ సవరణలు,ఏటీఎం ద్వారా నిధుల ఉపసంహరణ వంటి ఆధునిక సదుపాయాలు ఇందులో భాగమవుతాయని వివరించారు.

    వివరాలు 

    ఈపీఎఫ్‌ఓ దగ్గర రూ.27 లక్షల కోట్ల విలువైన నిధులు

    ఈపీఎఫ్‌ఓ వ్యవస్థను మరింత వేగవంతంగా, సమర్థవంతంగా, సౌకర్యవంతంగా మార్చడం ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు.

    ఇప్పటి వరకు క్లెయిమ్‌లు, సవరణల కోసం ఫారాలు పూరించడం, కార్యాలయాల చుట్టూ తిరగడం వంటి సమస్యలు ఉండగా, కొత్త వెర్షన్‌తో ఇవన్నీ తొలగిపోతాయని చెప్పారు.

    వేగంగా క్లెయిమ్ సెటిల్‌మెంట్‌ జరగడం వల్ల సభ్యుల ఖాతాల్లో డబ్బులు త్వరగా జమ కాబోతున్నాయని మంత్రి వివరించారు.

    ప్రస్తుతం ఈపీఎఫ్‌ఓ దగ్గర రూ.27 లక్షల కోట్ల విలువైన నిధులు నిల్వగా ఉన్నాయని, వీటికి కేంద్ర ప్రభుత్వం హామీతో పాటు సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ అందిస్తోందని తెలిపారు.

    వివరాలు 

     78 లక్షల మందికి లాభం 

    ఇంతకుముందే కేంద్రం సెంట్రలైజ్డ్ పెన్షన్ పేమెంట్ సిస్టమ్‌ను అమలులోకి తీసుకురావడంతో, దేశంలోని ఏ బ్యాంక్‌ ద్వారా అయినా పెన్షన్ పొందే అవకాశాన్ని కల్పించామన్నారు.

    దీని వలన 78 లక్షల మందికి లాభం చేకూరిందని తెలిపారు.

    అంతేకాదు, అటల్ పెన్షన్ యోజన, ప్రధాన మంత్రి జీవన్ బీమా యోజన, శ్రామిక్ జన్‌ధన్ యోజన వంటి వివిధ పెన్షన్ పథకాలను ఏకీకృతం చేసి, పెన్షన్ వ్యవస్థను మరింత స్థిరంగా, విస్తృతంగా మార్చే అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చిస్తున్నదని మాండవీయ వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఈపీఎఫ్ఓ
    మన్‌సుఖ్ మాండవీయ

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    ఈపీఎఫ్ఓ

    పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే పెన్షన్
    ఈపీఎఫ్ఓ వడ్డీ రేట్లు ఖరారు.. 8.15 శాతం ఇచ్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ బిజినెస్
    EPFO: ఈపీఎఫ్ఓలో భారీగా పెరిగిన సభ్యులు; జూన్‌లో 17.89 లక్షల మంది చేరిక  ఉద్యోగులు
    ETFలో తిరిగి ఇన్వెస్ట్ చేసేందుకు EPFO ఆసక్తి..ఆర్థిక మంత్రిత్వ శాఖతో చర్చలు బిజినెస్

    మన్‌సుఖ్ మాండవీయ

    కరోనాపై యుద్ధం.. నేడు దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో మాక్ డ్రిల్స్ కోవిడ్
    జనవరి 1నుంచి వారికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు తప్పనిసరి: కేంద్రం కరోనా కొత్త మార్గదర్శకాలు
    మన్సుఖ్ మాండవియా: 'కరోనా టీకా ద్వారా భారత్ 3.4మిలియన్ల మంది ప్రాణాలను కాపాడింది' కోవిడ్
    7రోజుల్లో మూడింతలు పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 6,050మందికి వైరస్; కేంద్రం హై అలర్ట్ కరోనా కొత్త కేసులు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025