NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Maruti Suzuki: మదుపర్లకు అత్యధిక డివిడెండ్‌ ప్రకటించిన మారుతీ సుజుకీ ఇండియా
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Maruti Suzuki: మదుపర్లకు అత్యధిక డివిడెండ్‌ ప్రకటించిన మారుతీ సుజుకీ ఇండియా
    మదుపర్లకు అత్యధిక డివిడెండ్‌ ప్రకటించిన మారుతీ సుజుకీ ఇండియా

    Maruti Suzuki: మదుపర్లకు అత్యధిక డివిడెండ్‌ ప్రకటించిన మారుతీ సుజుకీ ఇండియా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 25, 2025
    05:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ, మదుపర్లకు చరిత్రలోనే అత్యధిక డివిడెండ్‌ను ప్రకటించింది.

    తాజాగా మార్చితో ముగిసిన త్రైమాసిక ఫలితాలను ప్రకటించిన ఈ సంస్థ,గతేడాది ఈ సమయంలో అందించిన ఫలితాలతో పోలిస్తే, సమీకృత నికర లాభం 1.04 శాతం తగ్గి రూ.3,911.1 కోట్లకు పరిమితమైంది.

    అయితే, సంస్థ ఆపరేషన్స్‌ నుంచి వచ్చిన ఆదాయంలో 6.37 శాతం వృద్ధి నమోదు చేసి, రూ.40,920.1 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే కాలంలో ఆదాయం రూ.38,585.2 కోట్లుగా ఉంది.

    ఈ సారి అత్యధిక వార్షిక విక్రయాలు,ఎగుమతులు చేసినట్లు మారుతీ సుజుకీ వెల్లడించింది.

    దేశీయంగా అత్యధిక కార్లను ఎగుమతి చేసిన సంస్థగా ఇది వరుసగా నాలుగోసారి నిలిచింది.

    వివరాలు 

    'ఈ విటారా' విక్రయాలు సెప్టెంబర్‌ నుంచి.. 

    భారత్‌ నుంచి ఎగుమతయ్యే ప్యాసింజర్‌ కార్లలో 43 శాతం ఈ కంపెనీ వాటా కలిగి ఉంది.

    ఈ నేపథ్యంలో, బోర్డు 2024-25 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో షేరుకు రూ.135 బోనస్‌ను ఇవ్వాలని నిర్ణయించింది.

    ఈ డివిడెండ్‌ మారుతీ సుజుకీ బీఎస్‌ఈలో నమోదైనప్పటి నుంచి చెల్లించిన అత్యధిక డివిడెండ్‌.

    మారుతీ సుజుకీ ఎలక్ట్రిక్‌ కారు 'ఈ విటారా' విక్రయాలు ఈ ఏడాది సెప్టెంబర్‌ చివరి నుండి ప్రారంభించనున్నట్లు కంపెనీ ప్రకటించింది.

    ఈ కారు, కంపెనీ నుంచి వస్తున్న తొలి బ్యాటరీ వాహనం కావడం విశేషం. దీన్ని గుజరాత్‌ ప్లాంట్‌లో ఉత్పత్తి చేస్తున్నారు.

    ఈ కారు కేవలం భారత్‌లో మాత్రమే కాకుండా, 100 దేశాలకు కూడా ఎగుమతి చేయనున్నారు.

    వివరాలు 

    ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకధాటిగా 500 కిలోమీటర్లు 

    వీటిలో జపాన్‌,ఐరోపా దేశాలు కూడా ఉన్నాయి. కంపెనీ నాలుగో త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన తరువాత, ఛైర్మన్‌ ఆర్‌.సి. భరద్వాజ్‌ ఈ విషయాన్ని వెల్లడించారు.

    2025-2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ దాదాపు 70,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుందని, వీటిలో అత్యధిక భాగం ఎగుమతులకు సంబంధించి ఉంటుందని చెప్పారు.

    ఈ కారు తొలిసారి భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2025లో ప్రదర్శించబడింది.

    దీన్ని బీఈవీ ప్లాట్‌ఫామ్‌ హెర్టెక్ట్‌ ఈపై నిర్మించారు. ఈ కారు రెండు బ్యాటరీ ఆప్షన్లతో, 49 కిలోవాట్ల మరియు 61 కిలోవాట్ల బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంటుంది.

    ఒక్కసారి ఛార్జ్ చేసినప్పుడు, ఈ కారు ఏకధాటిగా 500 కిలోమీటర్ల ప్రయాణాన్ని చేయగలదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మారుతీ సుజుకీ

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    మారుతీ సుజుకీ

    Toyota: టయోటా నుంచి కొత్త మిడ్ సైజ్ ఎస్‌యూవీ.. లాంచ్ ఎప్పుడంటే? ఆటో మొబైల్
    త్వరలో మార్కెట్లోకి రానున్న సుజుకీ eWX.. ధర ఎంతంటే? ఆటో మొబైల్
    గ్లోబల్ మార్కెట్లలో మారుతీ సుజుకి జిమ్నీ ఫీచర్లలో స్వల్ప వ్యత్యాసాలు ఆటో మొబైల్
    Maruti Suzuki: మారుతీ సుజుకీపై ఎర్ర సముద్రం ఎఫెక్ట్‌.. మోడల్స్ ధరల పెంపు  ఆటోమొబైల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025