NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Nandini Milk : పాల ధరలు పెరుగనున్నాయ్.. వినియోగదారులకు కేఎమ్‌ఎఫ్‌ షాక్!
    తదుపరి వార్తా కథనం
    Nandini Milk : పాల ధరలు పెరుగనున్నాయ్.. వినియోగదారులకు కేఎమ్‌ఎఫ్‌ షాక్!
    పాల ధరలు పెరుగనున్నాయ్.. వినియోగదారులకు కేఎమ్‌ఎఫ్‌ షాక్!

    Nandini Milk : పాల ధరలు పెరుగనున్నాయ్.. వినియోగదారులకు కేఎమ్‌ఎఫ్‌ షాక్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 21, 2025
    01:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్‌ రాష్ట్రవ్యాప్తంగా నందిని పాల ధరలను పెంచేందుకు సిద్ధమైంది. లీటరుకు ఏకంగా రూ.5 పెంచేలా ప్రభుత్వం ముందు ప్రతిపాదనలు పెట్టినట్లు సమాచారం.

    ఈ ప్రతిపాదనకు మార్చి 7న రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో ఆమోదం లభిస్తే, కొత్త ధరలు వెంటనే అమలులోకి వచ్చే అవకాశం ఉంది. పాల ధర పెంపుతో పాటు పరిమాణం కూడా తగ్గించేలా కేఎమ్‌ఎఫ్‌ నిర్ణయం తీసుకుంది.

    ప్రస్తుతం ప్రతి పాల ప్యాకెట్‌లో 50 మిల్లీలీటర్ల అదనపు పాలను వినియోగదారులకు అందిస్తున్న సంగతి తెలిసిందే. అంటే, లీటరు ప్యాకెట్ 1,050 మిల్లీలీటర్లుగా ఉంది.

    అయితే తాజా ప్రతిపాదన ప్రకారం, దీనిని 1,000 మిల్లీలీటర్లకు కుదించనున్నారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే, లీటరు నందిని టోన్డ్‌ మిల్క్‌ ధర రూ.47కు పెరగనుంది.

    Details

    ఒక్కసారిగా రూ.5 పెంపు

    గతంలోనూ కేఎమ్‌ఎఫ్‌ పాల ధరలను క్రమంగా పెంచుతూ వచ్చింది. చివరిసారిగా జూన్‌ 2024లో లీటరుకు రూ.2 పెంచగా, అంతకుముందు జులై 2023లో రూ.3 పెంచింది.

    ఇప్పుడు ఒక్కసారిగా రూ.5 పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధమవ్వడం గమనార్హం. ఇంతలోనే కర్ణాటక ప్రజలకు నిత్యావసర ధరల పెరుగుదలతో మరో భారంగా మారనుంది.

    ఇటీవల కాఫీ బ్రూవర్ల సంఘం కాఫీ పౌడర్‌ ధరలను కిలోకు రూ.200 పెంచనున్నట్లు ప్రకటించింది. BMTC బస్సులు, నమ్మ మెట్రో ఛార్జీలు కూడా పెరిగాయి.

    ప్రభుత్వం నీటి సుంకం పెంచేందుకు పరిశీలనలో ఉండగా, విద్యుత్ సరఫరా కంపెనీలు యూనిట్‌కు 67 పైసలు పెంచడానికి కర్ణాటక విద్యుత్ కమిషన్ అనుమతి కోరాయి.

    ఇలా అన్నీ ధరలు పెరుగుతుండటంతో ప్రజలపై భారం మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక
    ప్రభుత్వం

    తాజా

    Pawan Kalyan: హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముహూర్తం ఖరారు.. వేదిక ఎక్కడంటే? పవన్ కళ్యాణ్
    Russia-Ukraine Conflict: ఫలితమివ్వని రష్యా, ఉక్రెయిన్‌ చర్చలు.. యుద్ధ ఖైదీల మార్పిడికే పరిమితం ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Andhra News: రాజధాని నుంచి రాయలసీమకు యాక్సెస్‌ కంట్రోల్‌ గ్రీన్‌ ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మించేందుకు ప్రణాళిక అమరావతి
    Pakistan: పాక్‌లో కలకలం.. మాలిర్ జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్ పాకిస్థాన్

    కర్ణాటక

    Supreme Court: హైకోర్టు మహిళ న్యాయమూర్తిపై జడ్జి వివాదాస్పద వ్యాఖ్యలు.. సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం  సుప్రీంకోర్టు
    Karnataka Muda scam: ముడా స్కామ్‌ కేసులో సిద్ధరామయ్యకు షాక్‌.. గవర్నర్‌ నిర్ణయాన్ని సమర్ధించిన హైకోర్టు  సిద్ధరామయ్య
    MUDA Scam: సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తోంది.. రాష్ట్ర కేసుల దర్యాప్తును  ఉపసంహరించుకున్న కర్ణాటక ప్రభుత్వం  సిద్ధరామయ్య
    Kunki elephants: కుంకీ ఏనుగుల అంశంపై ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం ఆంధ్రప్రదేశ్

    ప్రభుత్వం

    Gas Cylinder Price: పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు.. నేటి నుంచి అమల్లోకి! గ్యాస్
    New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డులు గ్రీన్ సిగ్నల్.. అర్హతలు ఇవే..! ఆంధ్రప్రదేశ్
    Singuru Project: సింగూరు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు.. పరీవాహక ప్రజలకు హెచ్చరికలు జారీ తెలంగాణ
    Runa Mafi: రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. రేపటి నుండి కొత్త యాప్ ద్వారా వారి వివరాలు సేకరణ తుమ్మల నాగేశ్వరరావు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025