NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Narayana Murthy: డివిడెండ్‌ రూపంలో రూ.3.3 కోట్లు అందుకోనున్న..  ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి మనవడు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Narayana Murthy: డివిడెండ్‌ రూపంలో రూ.3.3 కోట్లు అందుకోనున్న..  ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి మనవడు 
    డివిడెండ్‌ రూపంలో రూ.3.3 కోట్లు అందుకోనున్న.. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి మనవడు

    Narayana Murthy: డివిడెండ్‌ రూపంలో రూ.3.3 కోట్లు అందుకోనున్న..  ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి మనవడు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 18, 2025
    12:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రఖ్యాత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ సహవ్యవస్థాపకుడు నారాయణమూర్తి మరోసారి వార్తలలో నిలిచారు.

    ఆయన మనవడు ఏకాగ్రహ్‌ రోహన్‌ మూర్తికి సంస్థ నుంచి డివిడెండ్‌ రూపంలో రూ.3.3 కోట్లు లభించనున్న నేపథ్యంలో ఇది సంచలనంగా మారింది.

    వయసు కేవలం 17 నెలలే అయినా, ఈ బాలుడు ఇప్పటికే కోట్ల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.

    ఇన్ఫోసిస్‌ సంస్థ 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి తుది డివిడెండ్‌ ప్రకటించింది.

    ఒక్కో షేరుకు రూ.22 చెల్లించేందుకు సంస్థ బోర్డు ఆమోదం తెలిపింది.

    ఈ ప్రకటనతో నారాయణమూర్తి మనవడు ఏకాగ్రహ్‌ కు షేర్లపై డివిడెండ్‌గా రూ.3.3 కోట్లు లభించనున్నాయి.

    ఒక చిన్న వయస్సులోనే అంత పెద్ద మొత్తాన్ని పొందడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

    వివరాలు 

    ఇన్ఫోసిస్‌ మొత్తం ఈక్విటీలో 0.04 శాతం వాటా

    ఏకాగ్రహ్‌ రోహన్‌ మూర్తికి నాలుగు నెలల వయసున్నప్పుడు నారాయణమూర్తి ఆయనకు భారీ విలువైన షేర్లను బహుమతిగా ఇచ్చారు.

    అప్పటి విలువ ప్రకారం రూ.240 కోట్ల మోతాదులోని షేర్లను (సుమారు 15 లక్షల షేర్లు) ఆయన మనవడికి గిఫ్ట్‌ చేశారు.

    ఇది ఇన్ఫోసిస్‌ మొత్తం ఈక్విటీలో 0.04 శాతం వాటాగా ఉంటుంది.

    తాత నుండి లభించిన ఈ బహుమతితో ఏకాగ్రహ్‌ ఒక యంగ్‌ మిలియనీర్‌గా మారిపోయాడు.

    గత ఏడాది ఆయనే షేర్ల ద్వారా డివిడెండ్‌గా రూ.7.35 కోట్లు అందుకున్నారు.

    తాజాగా ప్రకటించిన డివిడెండ్‌ ప్రకారం ఈ ఏడాది ఆయనకు రూ.3.3 కోట్లు లభించనున్నాయి. దీనితో ఇప్పటి వరకు ఈ షేర్ల ద్వారా ఏకాగ్రహ్‌ సంపాదించిన మొత్తం రూ.10.65 కోట్లకు చేరింది.

    వివరాలు 

     రోహన్‌ నారాయణమూర్తి-సుధామూర్తి దంపతులకు మూడవ మనవడు

    ఏకాగ్రహ్‌ 2023 నవంబరులో రోహన్‌ మూర్తి, అపర్ణామూర్తి దంపతులకు జన్మించాడు.

    నారాయణమూర్తి-సుధామూర్తి దంపతులకు ఇది మూడవ మనవడు.

    ఇక అక్షతా మూర్తి - బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌ దంపతుల ఇద్దరు కుమార్తెలకు కూడా నారాయణమూర్తి-సుధామూర్తి గారే తాతయ్య తాతయ్యలు కావడం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఇన్ఫోసిస్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    ఇన్ఫోసిస్

    Infosys: నెలకు 10 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే.. ఉద్యోగులకు ఇన్ఫోసిస్ హుకుం  బిజినెస్
    Infosys: ఉద్యోగులకు 80శాతం బోనస్ ప్రకటించిన ఇన్ఫోసిస్  ఉద్యోగులు
    Narayana Murthy : డీప్‌ఫేక్ వీడియోలపై హెచ్చరించిన ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి.. నేను అలా అనలేదు, ఎవరూ నమ్మకండి  డీప్‌ఫేక్‌
    Infosys-Wipro-Tcs: విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్‌లలో 63,759 మంది ఉద్యోగాలను కోల్పోయారు  విప్రో
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025