NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / New rules 1 June 2025: జూన్ నుంచి కొత్త రూల్స్ అమలు.. మీ ఖర్చులపై ప్రభావం పడే అవకాశం?
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    New rules 1 June 2025: జూన్ నుంచి కొత్త రూల్స్ అమలు.. మీ ఖర్చులపై ప్రభావం పడే అవకాశం?
    జూన్ నుంచి కొత్త రూల్స్ అమలు.. మీ ఖర్చులపై ప్రభావం పడే అవకాశం?

    New rules 1 June 2025: జూన్ నుంచి కొత్త రూల్స్ అమలు.. మీ ఖర్చులపై ప్రభావం పడే అవకాశం?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 30, 2025
    09:09 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జూన్ నెల ప్రారంభానికి దగ్గరపడుతోంది.

    ప్రతి నెల మాదిరిగా ఈ నెలలో కూడా పలు మార్పులు చోటు చేసుకోనున్నాయి.

    బ్యాంకుల ఫిక్స్‌డ్ డిపాజిట్ (FD) వడ్డీ రేట్లు, క్రెడిట్ కార్డ్ నిబంధనలు, ఆధార్ అప్‌డేట్, LPG ధరలు, అలాగే EPFO కొత్త వెర్షన్ ప్రారంభం వంటి కీలక అంశాలు ఈ మార్పుల్లో భాగంగా ఉన్నాయి.

    ఈ మార్పులు పరోక్షంగా సామాన్య ప్రజల జీవన శైలిపై ప్రభావం చూపే అవకాశముంది. ఇక జూన్‌లో అమలులోకి రానున్న ముఖ్యమైన మార్పులు ఇవే

    Details

    EPFO 3.0 ప్రారంభం

    ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) జూన్‌లో తన కొత్త వేదిక అయిన EPFO 3.0ను ప్రవేశపెట్టనుంది.

    ఈ కొత్త వ్యవస్థ ద్వారా సభ్యులకు మరింత సులభతరమైన సేవలు అందుబాటులోకి రానున్నాయి.

    ఇందులో భాగంగా ATMల ద్వారా నిధుల ఉపసంహరణ, PF డేటా అప్‌డేటింగ్ వంటి పలు సౌకర్యాలు మరింత వేగంగా, సురక్షితంగా అందుబాటులోకి రానున్నాయి.

    FD వడ్డీ రేట్లలో మార్పులు

    జూన్‌లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటును మళ్లీ సమీక్షించనుంది. రెపో రేటులో తగ్గుదల జరిగే అవకాశముందని భావిస్తున్నారు.

    దీనివల్ల పలు బ్యాంకులు తమ FD వడ్డీ రేట్లు, రుణాలపై వడ్డీ రేట్లను సవరించే అవకాశం ఉంది.

    Details

    క్రెడిట్ కార్డు నిబంధనల్లో మార్పు

    కోటక్ మహీంద్రా బ్యాంకు తన క్రెడిట్ కార్డులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నిబంధనల్లో మార్పులు చేసింది. ఇవి జూన్ 1, 2025 నుంచి అమలులోకి రానున్నాయి.

    ఈ మార్పులు రివార్డ్ పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌ ఆఫర్లు, ఇతర ఛార్జీలపై ప్రభావం చూపనున్నాయి.

    కోటక్ మహీంద్రా క్రెడిట్ కార్డ్ వినియోగదారులు మార్పులను గమనించాలి.

    LPG సిలిండర్ ధరల సమీక్ష

    ప్రతినెలా తొలి తేదీన గ్యాస్ ఏజెన్సీలు గృహ, వాణిజ్య LPG ధరలను సమీక్షిస్తాయి.

    గతేడాది నుంచి దేశీయ సిలిండర్ ధరల్లో పెద్దగా మార్పులేదు. అయితే వాణిజ్య సిలిండర్ల ధరల్లో మాత్రం ఇటీవల తగ్గుదల కనిపించింది.

    మే నెలలో వాణిజ్య సిలిండర్ల ధరలను సుమారు రూ.17 వరకూ తగ్గించారు. జూన్‌లో మరిన్ని సవరింపులు జరిగే అవకాశముంది.

    Details

    ఆధార్‌ ఉచిత అప్‌డేట్‌ గడువు ముగింపు 

    కేంద్ర ప్రభుత్వం ఆధార్‌ డేటా ఉచిత అప్‌డేట్‌కి ఇచ్చిన గడువు జూన్ 14తో ముగియనుంది. ఈ గడువులోగా 'మై ఆధార్‌' పోర్టల్‌' ద్వారా వినియోగదారులు తమ వివరాలను ఉచితంగా సవరించుకోవచ్చు.

    గడువు అనంతరం ఆధార్ కేంద్రాల్లో అప్‌డేట్ చేసుకునేందుకు రూ.50 చెల్లించాల్సి ఉంటుంది.

    ఈ మార్పులన్నీ ప్రత్యక్షంగా కాకపోయినా, సామాన్యుల ఆర్థిక వ్యవహారాలపై ప్రభావం చూపే విధంగా ఉన్నాయి.

    జూన్ 1 నుంచి అమలులోకి రానున్న ఈ నియమాలు, ధరల మార్పులపై ప్రజలు అప్రమత్తంగా ఉండటం అవసరం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం
    భారతదేశం

    తాజా

    New rules 1 June 2025: జూన్ నుంచి కొత్త రూల్స్ అమలు.. మీ ఖర్చులపై ప్రభావం పడే అవకాశం? కేంద్ర ప్రభుత్వం
    Shashi Tharoor: ఆపరేషన్ సిందూర్ పై కొలంబియా వైఖరి పట్ల శశి థరూర్ నిరాశ  శశిథరూర్
    Jurala Project: మే నెలలోనే తెరుచుకున్న జూరాల ప్రాజెక్టు గేట్లు.. 18 ఏళ్ల అనంతరం వేసవిలో పోటెత్తిన జలాశయం తెలంగాణ
    Andhra Pradesh: ఎన్టీఆర్‌ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్‌ పింఛన్లు.. మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్

    కేంద్ర ప్రభుత్వం

    AP-Telangana: తెలంగాణ-ఏపీకి కొత్త కనెక్షన్..  కృష్ణా నదిపై తొలి కేబుల్ బ్రిడ్జి! తెలంగాణ
    Starlink: భారత్‌లో స్టార్‌లింక్‌ ఎంట్రీకి కేంద్ర ప్రభుత్వం కఠిన షరతులు.. వాటికి అంగీకరిస్తేనే సేవలు అందుబాటులోకి.. బిజినెస్
    Delhi Airport: కేంద్రంపై దిల్లీ విమానాశ్రయం దావా.. హిండన్ ఎయిర్‌బేస్ వివాదం! దిల్లీ
    PM Modi: ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258 కోట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం భారతదేశం

    భారతదేశం

    Operation Sindoor: పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'.. పేరులోనే బలమైన సందేశం  భారతదేశం
    Israel Backs India: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు ఇజ్రాయెల్ మద్దతు ఇజ్రాయెల్
    Mock Dril: దేశ వ్యాప్తంగా 244 ప్రాంతాల్లో సివిల్ మాక్ డ్రిల్ ప్రారంభం  భారతదేశం
    Baglihar Dam:బాగ్లిహార్ డ్యాం గేట్లు ఎత్తేసిన భారత్.. దాయాది దేశంలో భయం భయం.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025