NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ మార్కెట్‌ సూచీలు.. 24,200 దిగువకు నిఫ్టీ
    తదుపరి వార్తా కథనం
    Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ మార్కెట్‌ సూచీలు.. 24,200 దిగువకు నిఫ్టీ
    నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ మార్కెట్‌ సూచీలు.. 24,200 దిగువకు నిఫ్టీ

    Stock Market: నష్టాల్లో ట్రేడవుతున్న దేశీయ మార్కెట్‌ సూచీలు.. 24,200 దిగువకు నిఫ్టీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 08, 2024
    10:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం నష్టాల్లో ట్రేడవుతున్నాయి. తొలుత స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్, కాసేపటికే నష్టాల్లోకి జారింది.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) తమ పెట్టుబడులను మార్కెట్ నుండి ఉపసంహరించుకోవడం, నిరాశ కలిగించే కార్పొరేట్ ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్‌ను ప్రభావితం చేశాయి.

    ఫలితంగా మార్కెట్ స్థిరత్వంతో ముందుకు సాగుతోంది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్ 129 పాయింట్లు పడిపోయి 79,452 వద్ద, నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 24,163 వద్ద ట్రేడవుతోంది.

    వివరాలు 

    ఔన్సుకు 2,703.10 డాలర్ల వద్ద బంగారం 

    సెన్సెక్స్ 30లోని రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, మారుతీ సుజుకీ, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్‌గ్రిడ్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, భారతీ ఎయిర్‌టెల్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫిన్‌సర్వ్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

    ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, టీసీఎస్ లాభాల్లో ఉన్నాయి.

    అంతర్జాతీయంగా బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 75.21 డాలర్ల వద్ద, బంగారం ఔన్సుకు 2,703.10 డాలర్ల వద్ద ఉంది.

    వివరాలు 

    వడ్డీ రేట్లపై ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం...

    అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిసాయి, ఆసియా-పసిఫిక్ మార్కెట్లు నేడు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

    ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్ 1శాతం, జపాన్ నిక్కీ 0.34శాతం లాభాల్లో ఉండగా, షాంఘై 0.46శాతం, హాంకాంగ్ హాంగ్‌సెంగ్ సూచీ 0.32శాతం నష్టాల్లో ఉన్నాయి.

    నవంబర్ నుండి విక్రయాలు చేపడుతున్న విదేశీ సంస్థాగత మదుపర్లు గురువారం నికరంగా రూ.4,889 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.1,787 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

    అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్లను 0.25శాతం తగ్గించింది.

    సెప్టెంబర్‌లో 0.50శాతం తగ్గించిన తరువాత, వృద్ధి ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తాజా సవరణ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    PM Modi: ఉగ్రవాదులను చావు దెబ్బకొట్టాం.. సైనికుల ధైర్యానికి దేశం గర్విస్తోంది : మోదీ నరేంద్ర మోదీ
    Truecaller: ట్రూకాలర్‌లో కొత్త ఏఐ ఫీచర్.. స్పామ్ సందేశాలకు చెక్‌! ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    OG : పవన్ కళ్యాణ్ 'ఓజీ' షూట్ రీస్టార్ట్.. ఆనందంలో ఫ్యాన్స్! పవన్ కళ్యాణ్
    PM Modi: మోదీ ప్రెస్‌మీట్‌పై ఉత్కంఠ.. కీలక ప్రకటన వచ్చే అవకాశం! నరేంద్ర మోదీ

    స్టాక్ మార్కెట్

    Tata Group: పాకిస్థాన్ జీడీపీని అధిగమించిన టాటా గ్రూప్ మార్కెట్ విలువ  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
    Sensex : 75000 దాటిన సెన్సెక్స్,నిఫ్టీ సరికొత్త రికార్డు బిజినెస్
    Stock market: 5 రోజుల లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ , నిఫ్టీ కూడా డౌన్ బిజినెస్
    Sensex-Nifty-Monday: 74,671 పాయింట్లకు ఎగబాకిన సెన్సెక్స్...22,640 పాయింట్ల వద్ద స్థిరపడిన నిఫ్టీ సెన్సెక్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025