NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
    లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    Stock Market: అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నడుమ.. లాభాల్లో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 14, 2024
    09:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మిశ్రమ సంకేతాల నేపథ్యంలో సూచీలు కొంత జాగ్రత్తగా కొనసాగుతున్నాయి.

    ప్రారంభంలో ఫ్లాట్‌గా ఉండగా, కొద్ది సమయం తర్వాత లాభాల్లోకి మళ్లాయి. ఉదయం 9:30 గంటలకు సెన్సెక్స్ 91 పాయింట్ల పెరుగుదలతో 77,782 వద్ద, నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 23,587 వద్ద ట్రేడవుతున్నాయి.

    డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.40 వద్ద ఉంది.

    వివరాలు 

    సెన్సెక్స్‌ 30 (SENSEX)

    సెన్సెక్స్‌ 30లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ఫార్మా, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎన్టీపీసీ వంటి షేర్లు లాభాల్లో ఉన్నాయి.

    అల్ట్రాటెక్‌ సిమెంట్‌, పవర్‌ గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ సుజుకీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 72.02 డాలర్ల వద్ద, బంగారం ఔన్సు 2,567 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    వివరాలు 

    ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు కూడా ఇదే ధోరణి

    అమెరికా మార్కెట్లు బుధవారం మిశ్రమ ముగింపును చూశాయి, అలాగే ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లు కూడా ఇదే ధోరణిని పాటిస్తున్నాయి.

    ఆసియా మార్కెట్‌లో ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.26శాతం, జపాన్‌ నిక్కీ 0.10శాతం లాభాల్లో ఉండగా, హాంకాంగ్‌ హాంగ్‌సెంగ్‌ 0.69శాతం, షాంఘై 0.28శాతం నష్టాల్లో ఉన్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) బుధవారం రూ.2,503 కోట్ల షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.6,145 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    వివరాలు 

    స్విగ్గీ షేర్లు 6శాతం లాభంతో ప్రారంభం

    నిన్న దలాల్‌ స్ట్రీట్‌లో లిస్ట్‌ అయిన స్విగ్గీ షేర్లు రెండో రోజు కూడా మంచి లాభాలతో కొనసాగాయి.

    ఇవి మార్కెట్‌ ప్రారంభంలోనే 6 శాతం లాభంతో రూ.471 వద్ద ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

    ఇష్యూ ధర రూ.390 కాగా, నిన్న మార్కెట్‌లో రూ.420 వద్ద లిస్ట్‌ అయ్యాయి. మొదటి రోజు ముగింపులో ఏకంగా 16.92శాతం లాభంతో రూ.456 వద్ద ముగిశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    స్టాక్ మార్కెట్

    Stock Market: స్టాక్ మార్కెట్ పతనం.. 550 పాయింట్లు కుంగిన సెన్సెక్స్‌  బిజినెస్
    Stock market: అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం.. కుదేలైన దేశీయ స్టాక్ మార్కెట్  బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు; సెన్సెక్స్‌ 256 , నిఫ్టీ@ 22650  బిజినెస్
    Nifty: నిఫ్టీ ఆల్‌టైమ్ రికార్డ్.. ఆ స్థాయిలో ట్రేడవడం ఇదే తొలిసారి  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025