RBI: సాయంత్రం 7 తర్వాత నో కాల్స్.. రికవరీ ఏజెంట్ల వేధింపులకు ఆర్బీఐ చెక్
ఈ వార్తాకథనం ఏంటి
రుణాల వసూలు ప్రక్రియలో రుణగ్రహీతలకు న్యాయమైన వ్యవహారం కల్పించాలనే ఉద్దేశంతో ఆర్ బి ఐ కీలక మార్పులు ప్రతిపాదించింది. రుణ బకాయిల వసూళ్ల సమయంలో పాటించాల్సిన నిబంధనలు, రికవరీ ఏజెంట్ల నియామకం, వారి ప్రవర్తన ప్రమాణాలపై సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం 'హర్ష్ రికవరీ ప్రాక్టీసెస్'గా పరిగణించే చర్యలను స్పష్టంగా చూపారు. సాయంత్రం 7 గంటల తర్వాత రుణగ్రస్తులకు కాల్ చేయరాదని స్పష్టం చేశారు. రికవరీ ఏజెంట్లకు తప్పనిసరిగా సర్టిఫికేషన్ ఉండాలని పేర్కొన్నారు. అలాగే భద్రత కలిగిన ఆస్తులను స్వాధీనం చేసుకునే విధానంపై కూడా వివరణాత్మక విధి విధానాలు రూపొందించారు.
Details
జూలై 1నుంచి అమల్లోకి
ఈ సవరణలు జూలై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశంలోని అన్ని కమర్షియల్ బ్యాంకులు, స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, పేమెంట్స్ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, లోకల్ ఏరియా బ్యాంకులకు ఇవి వర్తిస్తాయి. గత వారం ద్రవ్య పరపతి విధాన ప్రకటనలో ఆర్బీఐ గవర్నర్ చేసిన ప్రకటనలలో భాగంగానే ఈ నిర్ణయం వెలువడింది. ఇంకా, రికవరీ ఏజెంట్ల నియామకానికి సంబంధించి ప్రతి బ్యాంకు బోర్డు ఆమోదించిన స్పష్టమైన విధానాన్ని రూపొందించాల్సిందిగా ఆర్బీఐ ఆదేశించింది. ఏజెంట్ల నియామక ప్రక్రియ, అనుసరించాల్సిన ప్రవర్తనా ప్రమాణాలు, కస్టమర్ ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థపై స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని పేర్కొంది. ఈ చర్యలతో రుణగ్రస్తులకు హక్కులు రక్షించబడటంతో పాటు వసూలు ప్రక్రియలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం పెరుగుతాయని ఆర్బీఐ భావిస్తోంది.