NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / UPI Payments in Banks : RBI కీలక ప్రకటన.. త్వరలో UPI ద్వారా నగదు డిపాజిట్ చేయొచ్చు!
    తదుపరి వార్తా కథనం
    UPI Payments in Banks : RBI కీలక ప్రకటన.. త్వరలో UPI ద్వారా నగదు డిపాజిట్ చేయొచ్చు!
    RBI కీలక ప్రకటన.. త్వరలో UPI ద్వారా నగదు డిపాజిట్ చేయొచ్చు!

    UPI Payments in Banks : RBI కీలక ప్రకటన.. త్వరలో UPI ద్వారా నగదు డిపాజిట్ చేయొచ్చు!

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 05, 2024
    06:03 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యూపీఐ వినియోగదారులకు భారత రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పింది.

    రాబోయే కాలంలో,యూపీఐ ద్వారా బ్యాంకుల్లో నగదు డిపాజిట్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించనుంది.

    యూపీఐ ద్వారా నగదు డిపాజిట్ మెషీన్లలో డబ్బును డిపాజిట్ చేసే సదుపాయాన్ని ఆర్ బి ఐ త్వరలో ప్రారంభించబోతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.

    ప్రస్తుతానికి ఏటీఎం మిషన్లలో నగదు డిపాజిట్ సౌకర్యం అనేది డెబిట్ కార్డుల ద్వారా మాత్రమే అందుబాటులో ఉంది.

    అయితే,యూపీఐ పేమెంట్లకు ఫుల్ డిమాండ్ ఉన్న కారణంగా ఏటీఎంలలో కార్డ్ లెస్ క్యాష్ డిపాజిట్ ఫీచర్ ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు.

    ద్రవ్య విధాన సమావేశంలో గవర్నర్ ఈ ప్రకటన చేశారు.

    Details 

    ఈ సదుపాయం ఎప్పుడు ప్రారంభమవుతుంది? 

    ప్రస్తుతం యూపీఐ ద్వారా ఏటీఎం మెషీన్‌ నుంచి నగదు తీసుకునే సౌకర్యం అందుబాటులో ఉంది.

    నగదు డిపాజిట్ మెషీన్లలో డబ్బును డిపాజిట్ చేసే సదుపాయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించింది.

    అయితే, ఈ సదుపాయం ఎప్పుడు ప్రారంభమవుతుంది? దీనికి ఎలాంటి నిర్ణీత తేదీని ఇవ్వలేదు.

    ఆర్‌బిఐ ప్రకారం, ఒక వైపు బ్యాంకుల నగదు డిపాజిట్ మెషీన్‌ల వాడకంతో కస్టమర్ల సౌలభ్యం పెరిగింది.

    అదే సమయంలో బ్యాంకులో నగదు జమ చేయాలనే ఒత్తిడి తగ్గింది. థర్డ్-పార్టీ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) అప్లికేషన్‌ల ద్వారా ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPIs) లింక్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్ కూడా అనుమతించాలని నిర్ణయించింది.

    Details 

    రిటైల్ ఇన్వెస్టర్ల కోసం యాప్‌ను ప్రారంభించనున్న ఆర్‌బీఐ

    RBI గవర్నర్ చేసిన ప్రసంగంలో, RBI త్వరలో రిటైల్ డైరెక్ట్ కోసం యాప్‌ను లాంచ్ చేయనున్నట్లు చెప్పారు.

    దీని ద్వారా, పెట్టుబడిదారులు నేరుగా ఆర్‌బిఐలో ప్రభుత్వ సెక్యూరిటీలలో సులభంగా పెట్టుబడి పెట్టవచ్చు.

    ప్రస్తుతం, మీరు RBI పోర్టల్ ద్వారా నేరుగా ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడి పెట్టడానికి సెంట్రల్ బ్యాంక్‌లో ఖాతాను తెరవవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    యూపీఐ
    ఆర్ బి ఐ

    తాజా

    Operation Sindoor: ఉగ్రవాదం నిర్మూలనకే 'ఆపరేషన్‌ సిందూర్‌' : భారత సైన్యం భారత సైన్యం
    INDw vs SLw: మహిళల ముక్కోణపు వన్డే టైటిల్ భారత్‌దే స్మృతి మంధాన
    operation sindoor: ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదు : భారత్  ఆపరేషన్‌ సిందూర్‌
    HYD Metro: ప్రపంచానికి బ్లూప్రింట్‌గా హైదరాబాద్ మెట్రో.. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ప్రశంసలు! హైదరాబాద్

    యూపీఐ

    UPI: అక్టోబర్‌లో UPI లావాదేవీలు రూ.17.16లక్షల కోట్లు.. వరుసగా మూడు నెలల్లో వెయ్యికోట్లు దాటిన ట్రాన్సాక్షన్స్‌  యూపీఐ పేమెంట్స్
    UPI ద్వారా తప్పుడు పేమెంట్ చేశారా? చింతించకుండా ఇలా రికవరీ చేసుకోండి  యూపీఐ పేమెంట్స్
    New Year 2024 : ఈ ఏడాది యూపీఐ, వడ్డీ రేట్లు, సిమ్ కార్డ్స్ విషయంలో వచ్చే కీలక మార్పులు ఇవే యూపీఐ పేమెంట్స్

    ఆర్ బి ఐ

    యూపీఐ లైట్ లో సరికొత్త విధానం: 500రూపాయల వరకు పిన్ అక్కర్లేదు  బిజినెస్
    RBI: ఆర్బీఐ కీలక నిర్ణయం.. దివాలా తీసిన రుణగ్రహీతలపై అధిక ఛార్జీలు విధించొద్దు  వ్యాపారం
    పెద్ద నోట్ల మార్పిడిపై ఆర్బీఐ కీలక ప్రకటన.. 93 శాతం నోట్లు వెనక్కి బిజినెస్
    యూపీఐ పేమెంట్స్ మరింత సులువు.. వాయిస్ మెసేజ్‌తో చెల్లింపులు! బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025