NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో..
    ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా..

    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 04, 2025
    12:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రపంచంలోనే అత్యధిక విలువ కలిగిన సంస్థగా నివిడియా (Nvidia) కొత్త రికార్డు సృష్టించింది.

    కంపెనీ ప్రకటించిన మెరుగైన త్రైమాసిక ఆర్థిక ఫలితాల ప్రభావంతో మంగళవారం మార్కెట్లలో షేర్లు బలంగా రాణించాయి.

    మంగళవారం ట్రేడింగ్‌లో ఎన్విడియా షేర్లు 3.4 శాతం పెరిగాయి.

    ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ 3.45 ట్రిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంది.

    ఇది సుమారుగా రూ.296.22 లక్షల కోట్లు అవుతుంది. ఇప్పటివరకు ఈ స్థానాన్ని కొనసాగించిన మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్రస్తుతం రెండో స్థానానికి పడిపోయింది.

    కృత్రిమ మేధస్సు (AI) రంగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను భారీగా పెంచుకున్న ఎన్విడియా, ప్రపంచంలో నెంబర్ వన్ కంపెనీగా నిలిచింది.

    వివరాలు 

    ఎన్విడియా  ఏఐకు అవసరమైన మౌలిక వనరుల నిర్మాణంపైన కూడా దృష్టి 

    ఏప్రిల్‌తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించి ఎన్విడియా ప్రకటించిన ఫలితాల్లో కంపెనీ ఆదాయం 44.1 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

    ఇది సుమారుగా రూ.3.78 లక్షల కోట్లు. గత త్రైమాసికంతో పోలిస్తే 12 శాతం వృద్ధి కాగా, గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే 69 శాతం పెరుగుదల నమోదైంది.

    వాణిజ్య ఆంక్షలు, కఠినమైన నియంత్రణల మధ్య కూడా కంపెనీ ఈ స్థాయి వృద్ధిని సాధించగలగడం గమనార్హం.

    ప్రస్తుతం ఎన్విడియా కేవలం చిప్‌ల తయారీలోనే కాకుండా, ఏఐకు అవసరమైన మౌలిక వనరుల నిర్మాణంపైన కూడా దృష్టి సారించింది.

    రాబోయే నాలుగు సంవత్సరాలలో సుమారు అర ట్రిలియన్ డాలర్ల విలువైన ఏఐ సూపర్ కంప్యూటర్లు, డేటా సెంటర్ల నిర్మాణం లక్ష్యంగా పెట్టుకుంది.

    వివరాలు 

    ఎన్విడియా ప్రపంచంలో అగ్రస్థానానికి చేరడం ఈ ఏడాది ఇది మూడోసారి

    ఈ క్రమంలోనే మే నెలలో ఎన్విడియా 'స్టార్‌గేట్ యూఏఈ' అనే ప్రాజెక్టును ప్రకటించింది.

    దీనిద్వారా అబుదాబీలో ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ డేటా సెంటర్లు ఏర్పడనున్నాయి.

    ఈ ప్రాజెక్టును ఓపెన్‌ఏఐ, ఒరాకిల్ వంటి ప్రముఖ సంస్థలతో భాగస్వామ్యంగా అమలు చేయనున్నారు.

    ఇదే కాకుండా, ఎన్విడియా ప్రపంచంలో అగ్రస్థానానికి చేరడం ఈ ఏడాది ఇది మూడోసారి.

    గతంలో జనవరి 24న ఈ ఘనతను సాధించింది. అయితే, అనంతరం తన స్థానాన్ని తాత్కాలికంగా కోల్పోయింది.

    కానీ, ఏఐ చిప్‌లకు పెరుగుతున్న డిమాండ్, గణనీయమైన ఆదాయ వృద్ధితో మళ్లీ మొదటి స్థానాన్ని తిరిగి పొందడంలో విజయవంతమైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నివిడియా

    తాజా

    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్

    నివిడియా

    NVIDIA: మైక్రోసాఫ్ట్ ను పక్కకు నెట్టి నెంబర్ 1 గా నిలిచిన NVIDIA  మైక్రోసాఫ్ట్
    Nividia: రికార్డు ర్యాలీ తర్వాత 3% పడిపోయిన ఎన్విడియా షేర్లు.. అగ్రస్థానాన్ని కోల్పోయిన మైక్రోసాఫ్ట్‌  మైక్రోసాఫ్ట్
    Nividia: సెల్-ఆఫ్ ను తాకిన NVIDIA.. స్టాక్ ధర 3 రోజుల్లో 13% తగ్గింది బిజినెస్
    NVIDIA: నివిడియా ఓపెన్ సోర్స్ GPU డ్రైవర్లు Linux కమ్యూనిటీకి ఎలా ప్రయోజనం చేకూరుస్తాయి టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025