NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / వినియోగదారులకు ఉల్లి షాక్.. ఆగస్ట్ చివరి నాటికి కిలో ఉల్లి రూ.70పైనే!
    తదుపరి వార్తా కథనం
    వినియోగదారులకు ఉల్లి షాక్.. ఆగస్ట్ చివరి నాటికి కిలో ఉల్లి రూ.70పైనే!
    ఆగస్ట్ చివరి నాటికి కిలో ఉల్లి రూ.70పైనే

    వినియోగదారులకు ఉల్లి షాక్.. ఆగస్ట్ చివరి నాటికి కిలో ఉల్లి రూ.70పైనే!

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 05, 2023
    03:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశంలో ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరగనున్నాయి. ఈ మేరకు క్రిసిల్ మార్కెట్ అంచనా వేసింది. ఆగస్ట్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు కిలో రూ. 70కి చేరే అవకాశం ఉందని క్రిసిల్ మార్కెట్ తాజా నివేదికలో ప్రకటించింది.

    ఇప్పటికే టమాటా ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. గత నెలలో దేశంలో కురిసిన భారీ వర్షాలు పంటను దెబ్బతిశాయి. మరోవైపు రబీ పంట ఉల్లి నిల్వల కాలం రెండు నెలల పాటు తగ్గిపోయింది.

    ఈ నేపథ్యంలోనే ఉల్లి నిల్వలు తగ్గుతూ ధరలు ఆకస్మికంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని క్రిసిల్ రిపోర్ట్ స్పష్టం చేసింది.

    నిల్వలు తగ్గినపుడు కిలో రూ.60 నుంచి 70 రూపాయల వరకు పెరగనున్నట్లు చెప్పుకొచ్చింది.

    DETAILS

     ఏటా అక్టోబర్‌లో మార్కెట్‌కు రానున్న ఖరీఫ్ ఉల్లి పంట 

    భారత్ లో ఉల్లి సాగు విస్తీర్ణం గతంలో కంటే ఎనిమిది శాతానికి తగ్గిపోయింది. దిల్లీ మార్కెట్‌ల్లో ఉల్లిగడ్డల రిటైల్ ధర కిలోకు రూ.30గా ఉంది. ఈ మేరకు డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ వెల్లడించింది.

    అక్టోబరు తర్వాత క్రమంగా ఉల్లి ధరలు తగ్గుముఖం పడతాయని క్రిసిల్ పేర్కొంది. ఏటా అక్టోబర్ నెలలోనే ఖరీఫ్ పంటకు సంబంధించిన ఉల్లి మార్కెట్‌లోకే వస్తుండటమే ధరల స్థీరకరణకు కారణమని చెప్పింది.

    ఖరీఫ్ ఉల్లి పంట మార్పిడితో పాటు దిగుబడి స్థాయిలను నిర్ణయించడంలో ఆగస్ట్, సెప్టెంబర్‌ల్లో వచ్చిన వర్షపాతానిదే కీలక పాత్ర అని నివేదిక తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కూరగాయలు
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    కూరగాయలు

    పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో ఆంధ్రప్రదేశ్  ఆంధ్రప్రదేశ్
    టమాట కిలో రూ.100; ధరలు అమాంతం పెరగడానికి కారణాలివే  ధర
    స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే! స్మార్ట్ ఫోన్
    టామాట బాటలోనే ఉల్లి.. త్వరలోనే భారీగా పెరగనున్న ఉల్లిగడ్డ ధరలు వర్షాకాలం

    తాజా వార్తలు

    TREIRB: రేపటి నుంచి గురుకుల ఉద్యోగ నియామక పరీక్షలు; బూట్లతో వస్తే నో ఎంట్రీ తెలంగాణ
    Supreme Court: 'ఆ 14రోజులు పోలీసులు ఏం చేశారు'? మణిపూర్‌పై సమగ్ర నివేదిక కోరిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    PM Modi Pune Visit: 'మిస్టర్ క్రైమ్ మినిస్టర్ గో బ్యాక్'.. పుణెలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా పోస్టర్లు  నరేంద్ర మోదీ
    Land-for-jobs scam: లాలూతో పాటు కుటుంబ సభ్యుల రూ.6 కోట్ల ఆస్తులు జప్తు లాలూ ప్రసాద్ యాదవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025