NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Petrol, Diesel Price Hike: పెరగనున్న పెట్రోల్, డీజల్ ధరలు.. సామాన్యులపై మరింత భారం
    తదుపరి వార్తా కథనం
    Petrol, Diesel Price Hike: పెరగనున్న పెట్రోల్, డీజల్ ధరలు.. సామాన్యులపై మరింత భారం
    పెరగనున్న పెట్రోల్, డీజల్ ధరలు.. సామాన్యులపై మరింత భారం

    Petrol, Diesel Price Hike: పెరగనున్న పెట్రోల్, డీజల్ ధరలు.. సామాన్యులపై మరింత భారం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 06, 2024
    04:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పశ్చిమాసియాలో చోటుచేసుకున్న తాజా ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు బ్యారెల్‌కు 6 డాలర్ల వరకు పెరిగాయి. ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసినట్లు సమాచారం.

    ఈ దాడికి ప్రతీకార చర్యగా ఇజ్రాయెల్ కూడా హెచ్చరికలను జారీ చేసింది. ఈ పరిణామాలు చమురు సరఫరాపై ప్రభావం చూపి, మున్ముందు ధరలు మరింత పెరగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

    చమురు ధరల పెరుగుదలతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్ ధరలపై కూడా ప్రభావం పడొచ్చని నిపుణులు చెబుతున్నారు. చమురు ధరలు పెరగడం కొత్త విషయం కాదు.

    1973లో యోమ్ కిప్పర్ యుద్ధం సమయంలో చమురు ధరలు నాలుగు రెట్లు పెరిగిన ఉదాహరణను విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.

    Details

    పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారే అవకాశం

    ఈ ఉద్రిక్తతలు కూడా పశ్చిమాసియా ప్రాంతంలో మరింత తీవ్రమైతే, గతంలో లాగానే, చమురు ధరల్లో భారీ పెరుగుదల కనిపించవచ్చని అంటున్నారు.

    ప్రస్తుతం, యూఎస్ ముడి చమురు ధర 74.38 డాలర్ల వద్ద ఉంది, అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు 78.05 డాలర్ల వద్ద ఉంది.

    అయితే పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత దిగజారితే చమురు ధరలు బ్యారెల్‌కు 80 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువకు చేరుకోవచ్చని ఎనర్జీ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

    చమురు ధరలు పెరగడంతో భారత్‌లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గేందుకు ఉన్న అవకాశాలు దెబ్బతినే సూచనలు కనిపిస్తున్నాయి.

    Details

    పెట్రోల్, డీజల్ పై లాభాలను ఆర్జిస్తున్న చమురు కంపెనీలు

    దేశంలోని చమురు కంపెనీలు లీటరు పెట్రోల్‌పై రూ. 15, లీటరు డీజిల్‌పై రూ. 12 లాభాలను ఆర్జిస్తున్నాయి.

    పశ్చిమాసియా ఉద్రిక్తతల కారణంగా వినియోగదారులు ఆశించిన ధరల తగ్గుదల దాదాపుగా అటకెక్కింది.

    గత రెండేళ్లుగా పెట్రోల్, డీజిల్ ధరలను పెద్దగా తగ్గించని కేంద్రం, ఈ పరిస్థితుల్లో మరింత కట్టుదిట్టంగా వ్యవహరించే అవకాశముంది.

    రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వడంతో, వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షించే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

    పశ్చిమాసియాలోని పరిణామాలు ఇలాగే కొనసాగితే, ఈ ధరలు తక్కువ కాకుండా, మరింత పెరిగే అవకాశం ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పెట్రోల్
    డీజిల్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    పెట్రోల్

    భారతదేశంలో ఫిబ్రవరి నుండి ఇంధన డిమాండ్ పెరిగింది వ్యాపారం
    ఇంధన ఎగుమతులపై ఆంక్షలను మార్చి తర్వాత కూడా పొడిగించాలనుకుంటున్న ప్రభుత్వం ప్రభుత్వం
    నేటి నుంచి అమల్లోకి వచ్చిన తగ్గిన గ్యాస్ ధరలు; సీఎన్‌జీ వినియోగదారులకు 40% ఎక్కువ ఆదా గ్యాస్
    SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంధనం

    డీజిల్

    డీజల్ వాహనాలను బ్యాన్ చేయాలి.. కేంద్రం వద్దకు కీలక నివేదిక ఎలక్ట్రిక్ వాహనాలు
    పెట్రోల్, డీజిల్‌ను రూ. 1 తక్కువే అమ్ముతాం: నయారా ఎనర్జీ  పెట్రోల్
    గుడ్‌న్యూస్; త్వరలో తగ్గనున్న పెట్రోల్-డీజిల్ ధరలు  చమురు
    మే నెలలో మైనస్ 3.48శాతానికి క్షీణించిన టోకు ద్రవ్యోల్బణం తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025