NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / essentials rates: నిత్యావసరాల ధరలు తెలంగాణలోనే అత్యధికం.. వినియోగదారుల ధరల సూచిక 2024 ఆగస్టు నివేదికలో కేంద్రం వెల్లడి
    తదుపరి వార్తా కథనం
    essentials rates: నిత్యావసరాల ధరలు తెలంగాణలోనే అత్యధికం.. వినియోగదారుల ధరల సూచిక 2024 ఆగస్టు నివేదికలో కేంద్రం వెల్లడి
    నిత్యావసరాల ధరలు తెలంగాణలోనే అత్యధికం

    essentials rates: నిత్యావసరాల ధరలు తెలంగాణలోనే అత్యధికం.. వినియోగదారుల ధరల సూచిక 2024 ఆగస్టు నివేదికలో కేంద్రం వెల్లడి

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 18, 2024
    10:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలో సగటు మనిషి ఆదాయం గత 12 ఏళ్లలో రెట్టింపు అయినప్పటికీ జీవన ప్రమాణాల్లో పెద్దగా మార్పు లేదు.

    దీనికి ప్రధాన కారణం, సామాన్య ప్రజలు ఉపయోగించే నిత్యావసర వస్తువులు, ఆహారం, వైద్య సేవల వంటి అవసరాల ధరలు సగటుగా అదే స్థాయిలో పెరగడమే.

    ముఖ్యంగా, ఇతర ప్రధాన రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో ఈ ధరలు మరింత ఎక్కువగా ఉన్నాయి.

    కేంద్ర గణాంకాల మంత్రిత్వశాఖ తాజాగా విడుదల చేసిన 2024 ఆగస్టు వినియోగదారుల ధరల సూచిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది.

    దేశవ్యాప్తంగా ధరల జాతీయ సగటు సుమారు 100 శాతం పెరిగినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇది 200 శాతానికి చేరింది.

    వివరాలు 

    నివేదిక వివరాలు

    జాతీయ నమూనా సర్వే సంస్థ, దేశవ్యాప్తంగా 1,114 పట్టణాలు, 1,181 గ్రామాల నుంచి సేకరించిన ధరల ఆధారంగా 'వినియోగదారుల ధరల సూచిక' (సీపీఐ) 'వినియోగదారుల ఆహార ధరల సూచిక' (సీఎఫ్‌పీఐ)ను విడుదల చేసింది.

    ఈ నివేదిక ముఖ్యమైన నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, వాటి ప్రభావం, రాష్ట్రాల వారీగా వివరాలను అందిస్తుంది.

    కూరగాయలు, పప్పుల ధరలు:

    2023 ఆగస్టుతో పోలిస్తే,2024 ఆగస్టులో మాంసం,చేపలు,సుగంధ ద్రవ్యాల ధరల ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ, కూరగాయలు, పప్పుల ధరలు పెరిగాయి.

    ఆహార ధరల సూచిక జాతీయ సగటు 192.5 నుండి 203.4కి పెరిగింది. ముఖ్యంగా, కూరగాయల ధరల సూచిక అత్యధికంగా 260.6కి చేరింది, గత ఏడాదితో పోలిస్తే ద్రవ్యోల్బణం 10.71 శాతం, పప్పుల ద్రవ్యోల్బణం 13.60 శాతం పెరిగింది.

    వివరాలు 

    తెలంగాణలో నిత్యావసరాల ధరలు

    రాష్ట్రాలవారీగా వినియోగదారుల ధరల సూచిక 2024లో ఎలా మారిందో కేంద్రం వివరించింది.

    2012లో 100 పాయింట్లు ఉన్న సీపీఐ 2024 ఆగస్టులో తెలంగాణలో 201.6 పాయింట్లకు పెరిగింది.

    త్రిపుర 215, మణిపూర్ 213.4 పాయింట్లతో ముందు ఉన్నా, తెలంగాణ 201.6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.

    ఇక్కడి భౌగోళిక పరిస్థితులు, వనరుల సమృద్ధితో ఉన్నప్పటికీ, నిత్యావసరాల ధరలు ఎక్కువగా ఉండటం గమనార్హం.

    2023 ఆగస్టులో 197.6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ, 2024లో 201.6 పాయింట్లతో అదే స్థానంలో కొనసాగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    తెలంగాణ

    Telangana: రాష్ట్రంలో AI పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సిద్ధంగా ఉంది: సీఎం రేవంత్ రెడ్డి
    Telangana: యువతా మేలుకో.. ఓటు నమోదు చేసుకో భారతదేశం
    Telangana: తెలంగాణ రైతుల కోసం రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. రైతుబీమాకు యాప్‌  భారతదేశం
    Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన.. ఇప్పటినుండి వారికీ  ఉచిత విద్యుత్   మల్లు భట్టి విక్రమార్క
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025