రెపో రేటు యథాతథం; 6.5 శాతమే కొనసాగించాలని ఆర్బీఐ నిర్ణయం
రెపో రేటును యథాతథంగా 6.5 శాతం కొనసాగించాలని నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ గురువారం తెలిపారు. ఈ మేరకు మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ)లో నిర్ణయం తీసుకున్నారు. రెపో రేటు మారకపోవడంతో ఎస్డిఎఫ్ రేటు 6.25 శాతం, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ, బ్యాంక్ రేట్లు 6.75శాతంలో కూడా ఎలాంటి మార్పులు ఉండబోవని దాస్ చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణం 2023 మార్చి-ఏప్రిల్లో తగ్గిందని ఆర్బీఐ తెలిపింది. 2023-24లో ద్రవ్యోల్బణం 4శాతం కంటే ఎక్కువగానే ఉంటుందని అంచనా వేసినట్లు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. వృద్ధికి మద్దతునిస్తూ, ద్రవ్యోల్బణం క్రమంగా లక్ష్యానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవడానికి వసతి ఉపసంహరణపై దృష్టి సారించాలని ఎంపీసీలో నిర్ణయించినట్లు ఆర్బీఐ గవర్నర్ వెల్లడించారు.