Page Loader
ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్; అమూల్, మదర్ డెయిరీకి గట్టి పోటీ తప్పదా? 
అమూల్, మదర్ డెయిరీకి పోటీగా ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్

ఐస్‌క్రీమ్ మార్కెట్‌లోకి రిలయన్స్; అమూల్, మదర్ డెయిరీకి గట్టి పోటీ తప్పదా? 

వ్రాసిన వారు Stalin
Apr 11, 2023
03:54 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశ శీతల పానీయాల మార్కెట్‌లోకి ఐకానిక్ కూల్ డ్రింక్ కాంపా-కోలాను తీసుకొచ్చిన ముకేష్ అంబానీ చెందిన రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, సాఫ్ట్ డ్రింక్ మార్కెట్‌ను శాసిస్తున్న కోకోకోలా, పెప్సీలకు పోటీగా నిలిచింది. తాజాగా రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ఐస్ క్రీమ్‌ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తద్వారా ఐస్ క్రీమ్‌ మార్కెట్‌లో టాప్‌లో ఉన్న అమూల్, మదర్ డైరీ వంటి పాల బ్రాండ్‌లతో పోటీ పడేందుకు సన్నద్ధమవుతోంది. రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో అమూల్ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రూపిందర్ సింగ్ సోధిని ఇటీవల నియమించడం వల్ల డెయిరీ మార్కెట్‌లో రిలయన్స్ కంపెనీ తన స్థాయిని పెంచుకునేందుకు చాలా వ్యహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు స్పష్టమవుతోంది.

 రిలయన్స్

గుజరాత్‌లోని తయారీదారులతో ఒప్పందం 

ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ గుజరాత్ నుంచి ఐస్ క్రీమ్‌ ఉత్పత్తులను ప్రారంభించాలని భావిస్తోంది. ఇండిపెండెన్స్ బ్రాండ్ క్రింద ఐస్ క్రీం ఉత్పత్తులను ప్రారంభించాలని యోచిస్తోంది. ఇందుకోసం గుజరాత్ రాష్ట్రంలోని తయారీదారులతో ఒప్పందం కుదుర్చుకోవచ్చని బిజినెస్ స్టాండర్డ్ నివేదించింది. మార్కెట్లోకి కొత్తగా వచ్చినా, అమూల్, మదర్ డెయిరీ వంటి బ్రాండ్‌లతో నేరుగా పోటీ పడాలని అనుకుంటోంది. కంపెనీ విస్తరణ ప్రణాళికలో భాగంగా మార్కెట్‌లోని కొన్ని కీలకమైన కొనుగోళ్లను కూడా చేయాలని ముకేష్ అంబానీ భావిస్తన్నట్లు బిజినెస్ స్టాండర్డ్ నివేదిక తెలిపింది.