NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Reliance Industries: న్యూస్ స్కోరింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానం.. తర్వాతి స్థానంలో ఎవరంటే? 
    తదుపరి వార్తా కథనం
    Reliance Industries: న్యూస్ స్కోరింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానం.. తర్వాతి స్థానంలో ఎవరంటే? 
    న్యూస్ స్కోరింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానం.. తర్వాతి స్థానంలో ఎవరంటే?

    Reliance Industries: న్యూస్ స్కోరింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానం.. తర్వాతి స్థానంలో ఎవరంటే? 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 30, 2024
    04:39 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆదాయాలు, లాభాలు, మార్కెట్‌ విలువ ఇలా ప్రతీదాంట్లోనూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ దూసుకుపోతోంది. రిలయెన్స్ గురించి ప్రతి చిన్న వార్త కూడా ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది.

    అందుకే ఈ సంస్థ తరచూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా విజికీ 2024కు గానూ ప్రకటించిన న్యూస్‌ స్కోర్‌ ర్యాంకింగ్స్‌ లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అగ్రస్థానాన్ని దక్కించుకుంది.

    విజికీ ప్రకారం 100 పాయింట్లకు గానూ రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ 97.43 పాయింట్లు సాధించింది.

    2023లో ఇదే సంస్థ 96.46 పాయింట్లు, 2022లో 92.56 పాయింట్లు, 2021లో 84.9 పాయింట్లు సాధించి, ఏటా అభివృద్ధి దిశగా పయనిస్తోంది.

    ఈ స్కోరింగ్‌ను ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, బిగ్‌ డేటా, మెషిన్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతికతలను వినియోగించి సుమారు 4 లక్షల పబ్లికేషన్ల ఆధారంగా రూపొందించారు.

    Details

    40వ ర్యాంకును దక్కించుకున్న అదానీ ఎంటర్ ప్రైజస్

    న్యూస్‌ స్కోర్‌ను లెక్కించడంలో వార్తల పరిమాణం, పతాక శీర్షికల ప్రాధాన్యం, పబ్లికేషన్ల సర్క్యులేషన్‌, పాఠకుల సంఖ్య వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు.

    ఇవన్నీ కలిపి రిలయన్స్‌ భారత్‌లోనే అత్యంత ప్రభావవంతమైన కంపెనీగా నిలవడానికి కారణమని విజికీ స్పష్టం చేసింది. రిలయన్స్‌ తర్వాతి స్థానంలో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 89.13 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది.

    బ్యాంక్‌ 86.24 పాయింట్లతో హెచ్‌డీఎఫ్‌సీ మూడోస్థానంలో ఉంది. ఎయిర్‌టెల్‌ ఏడో స్థానంలో ఉండగా, అదానీ గ్రూప్‌‌కు చెందిన అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 40వ ర్యాంకును దక్కించుకుంది.

    రిలయన్స్‌ విజయ ప్రస్థానం, మీడియా ప్రభావం, మార్కెట్‌ ఆధిపత్యం ఇలా అన్ని వైపులా దూసుకుపోతూ, న్యూస్‌ స్కోరింగ్‌లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రిలయెన్స్
    వ్యాపారం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రిలయెన్స్

    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    వైరల్ అవుతున్న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ నిశ్చితార్ధం ఫోటోలు జియో
    భారతదేశంలో మరో 50 కొత్త నగరాల్లో 5G సేవలు ప్రారంభించిన జియో జియో
    రిలయన్స్ జియో వార్షిక ప్రీపెయిడ్ ప్లాన్‌లు, డేటా, కాలింగ్ ప్రయోజనాలను తెలుసుకుందాం జియో

    వ్యాపారం

    Digital Arrest: డిజిటల్ అరెస్ట్.. కొత్త తరహా సైబర్ మోసాల పెనుముప్పు ఇండియా
    Hyderabad: హైదరాబాద్ వాసులకు బకాయిలు చెల్లించేందుకు సువర్ణావకాశం  హైదరాబాద్
    Car insurance claim : కారు బీమా క్లెయిమ్ ఎలా చేయాలి..? ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే!  కార్
    Bitcoin: బిట్‌కాయిన్ సృష్టికర్తకు సంబంధించి హెచ్‌బీవో డాక్యుమెంటరీ షాకింగ్ రివీల్స్ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025