NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Elon Musk: 'ఎక్స్‌' అధినేత ఎలాన్‌ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ దావా
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Elon Musk: 'ఎక్స్‌' అధినేత ఎలాన్‌ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ దావా
    'ఎక్స్‌' అధినేత ఎలాన్‌ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ దావా

    Elon Musk: 'ఎక్స్‌' అధినేత ఎలాన్‌ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ దావా

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 15, 2025
    09:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    సుమారు రెండున్నర సంవత్సరాల క్రితం ప్రపంచ ప్రసిద్ధి చెందిన మైక్రో బ్లాగింగ్‌ సైట్‌ 'ట్విట్టర్'ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచిన ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్‌ మస్క్‌ ఆ తర్వాత ట్విటర్‌ పేరును 'ఎక్స్‌'గా మార్చారు.

    అయితే,ఆయన ట్విటర్‌లో కొనుగోలు చేసిన వాటాల విషయాన్ని అమెరికా సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ)కు గడువు లోపల తెలియజేయలేదట.దీంతో తాజాగా యూఎస్‌ ఎస్‌ఈసీ ఆయనపై కేసు వేసింది.

    2022 ప్రారంభం నుండి,ఎలాన్‌ మస్క్ ట్విటర్‌లో వాటాలను కొనుగోలు చేయడం ప్రారంభించారు.

    ఆ ఏడాది మార్చి నాటికి,ఆయన 5%వాటాలను తెచ్చుకున్నారు.

    సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ నిబంధనల ప్రకారం, ఒక వ్యక్తి లేదా సంస్థ యాజమాన్యంలో 5% వాటా అధిగమిస్తే,ఆ విషయాన్ని 10 రోజుల్లోగా ఎక్స్ఛేంజ్‌కు తెలియజేయాలి.

    వివరాలు 

    వాషింగ్టన్‌ డీసీ ఫెడరల్‌ కోర్టులో ఎలాన్‌ మస్క్‌ మీద కేసు దాఖలు

    కానీ, ఎలాన్‌ మస్క్‌ 11 రోజులు ఆలస్యంగా, అంటే ఏప్రిల్ 4వ తేదీన ఈ విషయాన్ని బహిర్గతం చేశారు. ఆ సమయానికి ఆయన వాటా విలువ 9.2%కి చేరుకుంది.

    ఈ అంశంపై ఎస్‌ఈసీ దర్యాప్తు ప్రారంభించింది. తాజాగా, వాషింగ్టన్‌ డీసీ ఫెడరల్‌ కోర్టులో ఎలాన్‌ మస్క్‌ మీద కేసు దాఖలు చేశారు.

    గడువు లోపల వాటాల విషయాన్ని వెల్లడించనందుకు, ఆయనపై జరిమానా విధించమని వారు కోరారు. అంతేకాక, మస్క్‌ వాటాల ద్వారా పొందిన లాభాలను తిరిగి ఇవ్వాలని కూడా అభ్యర్థించారు. ఈ పిటిషన్‌పై ఎలాన్‌ మస్క్‌ లేదా 'ఎక్స్‌' సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

    వివరాలు 

    44 బిలియన్‌ డాలర్లకు ట్విటర్‌ కొనుగోలు

    ప్రారంభంలో 9.2% వాటాలను కొనుగోలు చేసిన మస్క్‌ తరువాత కంపెనీని పూర్తిగా కొనుగోలు చేయాలన్న ఆఫర్‌ ఇచ్చారు.

    2022 ఏప్రిల్‌లో ఈ ఒప్పందం ఖరారు అయ్యింది. అయితే, ఆపై డబ్బు విషయంలోని వివాదాల కారణంగా, 2022 జూలైలో ఒప్పందాన్ని రద్దు చేసినట్లు మస్క్‌ ప్రకటించారు.

    ఈ వివాదం కోర్టు పరిధికి వెళ్లింది. చివరికి, 44 బిలియన్‌ డాలర్లకు మస్క్‌ 2022లో ట్విటర్‌ను కొనుగోలు చేసి, దాన్ని 'ఎక్స్‌'గా మార్చి కొనసాగిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎలాన్ మస్క్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఎలాన్ మస్క్

    Trump Assassination Bid:ట్రంప్‌‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు అరెస్టు.. బయటికొచ్చిన దృశ్యాలు  డొనాల్డ్ ట్రంప్
    Musk Neuralink: న్యూరాలింక్ 'బ్లైండ్‌సైట్' పరికరానికి ఆమోదం.. న్యూరాలింక్
    X: ఎక్స్ బ్లాక్ ఫీచర్‌లో మార్పులు.. మీరు బ్లాక్ అయ్యిన తర్వాత కూడా పోస్ట్‌లను చూడగలరు ఎక్స్
    Elon Musk: ఇటలీ ప్రధానితో ఎలాన్ మస్క్ డేటింగ్..? స్పందించిన టెస్లా సీఈఓ ఇటలీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025