NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం 
    నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 19, 2025
    04:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయంగా ఎదురవుతున్న ప్రతికూల సంకేతాలు, అలాగే మార్కెట్లు గరిష్ఠ స్థాయులకు చేరుకోవడంతో లాభాల స్వీకరణకు పెట్టుబడిదారులు మొగ్గుచూపారు.

    ఈ ప్రభావంతో సూచీలు నెగటివ్‌గా కదలాయి. ముఖ్యంగా ఐటీ రంగ షేర్లు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యాయి.

    అమెరికా ప్రభుత్వ క్రెడిట్‌ రేటింగ్‌ను మూడీస్‌ ఏజెన్సీ AAA నుంచి AA1కి తగ్గించిందనే విషయం కూడా మార్కెట్లపై ప్రభావం చూపించింది.

    ఐటీ సంస్థలకు ముఖ్యంగా అమెరికా మార్కెట్ నుంచే ఎక్కువ ఆదాయం వస్తుండటంతో, ఈ రేటింగ్‌ తగ్గింపుతో వాటి షేర్లపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా, నిఫ్టీ సూచీ 25 వేల మార్క్‌ దిగువకు చేరిపోయింది.

    వివరాలు 

     సెషన్‌ ముగింపులో సెన్సెక్స్‌ 271.17 పాయింట్ల నష్టం 

    సెన్సెక్స్‌ సూచీ ఉదయం 82,354.92 పాయింట్ల వద్ద స్వల్ప లాభాలతో ప్రారంభమైంది.

    ఇది మునుపటి ముగింపు స్థాయి అయిన 82,330.59 పాయింట్లతో పోలిస్తే స్వల్పంగా ఎగబాకినట్లైంది.

    అనంతరం ఈ సూచీ రోజంతా ఓ నిశ్చిత శ్రేణిలోనే కదలాడింది. ఇంట్రాడే సమయంలో ఇది కనిష్టంగా 81,964.57 పాయింట్లు, గరిష్ఠంగా 82,424.10 పాయింట్ల మధ్య కదలాడింది.

    అంతిమంగా, సెషన్‌ ముగింపులో సెన్సెక్స్‌ 271.17 పాయింట్ల నష్టంతో 82,059 వద్ద స్థిరపడింది.

    నిఫ్టీ సూచీ కూడా 74.35 పాయింట్లు కోల్పోయి 24,945.45 వద్ద ముగిసింది. విదేశీ మారకద్రవ్యాల క్రమంలో రూపాయి విలువ డాలరుతో పోల్చితే 85.40గా నమోదైంది.

    వివరాలు 

    బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 64.72 డాలర్లు 

    సెన్సెక్స్‌ 30 షేర్లలో ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎటర్నల్‌, టెక్‌ మహీంద్రా, రిలయన్స్‌ షేర్లు భారీ నష్టాలను మూటగట్టుకున్నాయి.

    మరోవైపు, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎస్‌బీఐ, ఎన్టీపీసీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి.

    అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్ల విషయానికి వస్తే, బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 64.72 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 3239 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 271, నిఫ్టీ 74 పాయింట్ల చొప్పున నష్టం  స్టాక్ మార్కెట్
    Telangana: తెలంగాణా రాష్ట్రంలోని మూడు రైల్వే స్టేషన్లు పునః ప్రారంభం.. విశేషాలివే  తెలంగాణ
    IPL 2025: ఆర్సీబీ జట్టులో జింబాబ్వే ఫాస్ట్ బౌలర్‌కి అవకాశం బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Bhanu Prakash Reddy: తిరుమలలో మరో భారీ స్కామ్... తులాభారం కానుకలను దొంగలించారన్న భానుప్రకాశ్ రెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం

    స్టాక్ మార్కెట్

    Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 80 వేల మార్క్‌ దాటిన సెన్సెక్స్‌ బిజినెస్
    Stock Market : నష్టాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు - 80 వేల దిగువకు సెన్సెక్స్  బిజినెస్
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 315 పాయింట్లు, నిఫ్టీ 82 పాయింట్లు  బిజినెస్
    Stock Market :స్వల్ప లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించిన దేశీయ మార్కెట్లు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025