NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 728, నిఫ్టీ 181 పాయింట్లు చొప్పున నష్టం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 728, నిఫ్టీ 181 పాయింట్లు చొప్పున నష్టం 
    నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

    Stock market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 728, నిఫ్టీ 181 పాయింట్లు చొప్పున నష్టం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 26, 2025
    04:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వరుసగా ఏడు రోజుల పాటు లాభాల్లో దూసుకెళ్లిన సూచీలకు బ్రేక్ పడింది.భారత్‌పై టారిఫ్‌ల విషయంలో అమెరికా ఏ నిర్ణయం తీసుకుంటుందో త్వరలో స్పష్టత రానున్న వేళ,మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

    అంతేకాక,వరుస లాభాల నేపథ్యంలో లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి.

    ఇంట్రాడేలో 800 పాయింట్ల మేర నష్టపోగా,నిఫ్టీ 23,500 దిగువకు చేరుకుంది.దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టాలు చవిచూశాయి.

    సెన్సెక్స్‌ ఉదయం 78,021.45 పాయింట్ల వద్ద(మునుపటి ముగింపు 78,017.19)స్థిరంగా ప్రారంభమై, అనంతరం నష్టాల్లోకి జారుకుంది.

    ఇంట్రాడేలో 77,194.22 వద్ద కనిష్ఠాన్ని తాకి,చివరికి 728.69 పాయింట్ల నష్టంతో 77,288 వద్ద ముగిసింది.

    నిఫ్టీ 181.80 పాయింట్లు కోల్పోయి 23,486.85 వద్ద స్థిరపడింది. రూపాయి మారకం విలువ డాలరుతో రూ.85.69గా ఉంది.

    వివరాలు 

    మార్కెట్ పతనానికి ముఖ్య కారణాలు 

    సెన్సెక్స్‌ 30 సూచీలో ఎన్టీపీసీ, జొమాటో, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా నష్టపోగా, ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు లాభపడ్డాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.45 డాలర్లు, బంగారం ఔన్సు 3025 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    అమెరికా ప్రతీకార సుంకాలు: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏప్రిల్ 2 గడువు సమీపిస్తుండడంతో, మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.

    ట్రంప్‌ దూకుడుగా ముందుకు వెళితే, ఐటీ, ఫార్మా వంటి ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడే అవకాశమున్నట్లు అంచనా.

    వివరాలు 

    మార్కెట్ పతనానికి ముఖ్య కారణాలు 

    లాభాల స్వీకరణ: గత వారం రోజుల్లో సెన్సెక్స్‌, నిఫ్టీ 5% పైగా పెరగడంతో, మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు.

    క్రూడాయిల్ ధరలు: వెనుజువెలా, ఇరాన్‌ ఆయిల్ ఎగుమతులపై అమెరికా ఆంక్షలు కఠినతరం కావడంతో, అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పెరిగాయి. దీంతో, భారత్‌పై దిగుమతుల వ్యయం పెరుగుతుందన్న భయాలు సహా ప్రతికూలత ఏర్పడింది.

    స్టాక్ మార్కెట్ ఒత్తిడి: ఇన్ఫోసిస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్, యాక్సిస్, ఐసీఐసీఐ బ్యాంక్ వంటి అధిక వెయిటేజీ కలిగిన స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి పెరగడం సూచీల పతనానికి కారణమైంది.

    అమెరికా మార్కెట్ ప్రభావం: అమెరికాలో డాలర్ ఇండెక్స్, బాండ్ రాబడులు పెరగడం కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    స్టాక్ మార్కెట్

    Stock Market: స్వల్ప లాభాల్లో ప్రారంభమైన దేశీయ మార్కెట్‌ సూచీలు.. బిజినెస్
    Stock market: మరోసారి నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @ 22,119  బిజినెస్
    Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు  బిజినెస్
    Stock Market: వరుసగా 10వ రోజు నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025