NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం - రెండోరోజూ వెనకడుగు 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం - రెండోరోజూ వెనకడుగు 
    దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం - రెండోరోజూ వెనకడుగు

    Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభం - రెండోరోజూ వెనకడుగు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 17, 2025
    10:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రెండోరోజూ కూడా నష్టాలదిశగా ప్రారంభమయ్యాయి.

    అంతర్జాతీయ మార్కెట్ల నుంచి స్పష్టతలేని సంకేతాల నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    ఈ పరిస్థితుల మధ్య మార్కెట్ సూచీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే సెన్సెక్స్‌ సుమారు 180 పాయింట్ల నష్టంతో పడిపోయింది. అదే సమయంలో నిఫ్టీ 23,400 స్థాయికి దిగువన ట్రేడింగ్‌ ప్రారంభించింది.

    ఉదయం 9:25 గంటల సమయానికి, సెన్సెక్స్‌ 341 పాయింట్ల మేర నష్టపోయి 76,717 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ 117 పాయింట్లు నష్టపోయి 23,317 వద్ద ట్రేడవుతోంది.

    వివరాలు 

    బ్యాంక్‌ షేర్లు మాత్రం లాభాల్లో..

    సెన్సెక్స్‌ 30 షేర్లలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఎల్‌అండ్‌టీ, టాటా స్టీల్‌, టెక్ మహీంద్రా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టైటాన్‌, ఏషియన్ పెయింట్స్‌, హెచ్‌యూఎల్‌, ఎంఅండ్‌ఎం, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు నష్టాలను ఎదుర్కొంటున్నాయి.

    అయితే ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లు మాత్రం లాభాల్లో కొనసాగుతున్నాయి.

    వివరాలు 

    అమెరికా మార్కెట్లలో నష్టాలు - ఆసియా మార్కెట్లు మిశ్రమంగా 

    బుధవారం నాడు అమెరికా స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. డోజోన్స్‌ సూచీ 1.73 శాతం పడిపోయిందె, ఎస్‌అండ్‌పీ 500 2.24 శాతం దిగజారింది.

    నాస్‌డాక్‌ సూచీ అత్యధికంగా 3.07 శాతం నష్టపోయింది. కానీ ఆసియా-పసిఫిక్ మార్కెట్లు మాత్రం నేడు లాభదిశగా కదులుతున్నాయి.

    హాంగ్‌సెంగ్‌ సూచీ 1.34 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఆస్ట్రేలియాలోని ఏఎస్‌ఎక్స్‌ సూచీ 0.46 శాతం లాభించగా, జపాన్‌ నిక్కీ 0.86 శాతం లాభాల్లో ఉంది.

    హాంకాంగ్‌, షాంఘై మార్కెట్లు మాత్రం స్తబ్ధంగా (ఫ్లాట్‌గా) కదలాడుతున్నాయి - సుమారు 0.14 శాతం పరిధిలో ట్రేడవుతున్నాయి.

    వివరాలు 

    అంతర్జాతీయ ముడి వస్తువుల ధరలు - మదుపర్ల ధోరణి 

    ప్రపంచ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 66.45 డాలర్ల వద్ద కొనసాగుతోంది. బంగారం ఔన్సు ధర 3,354 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) ఇప్పటికే రెండవ రోజు కూడా కొనుగోళ్ల వైపు మొగ్గుచూపారు.

    బుధవారం ఒక్కరోజే నికరంగా రూ.3,936 కోట్ల విలువైన షేర్లను వారు కొనుగోలు చేశారు.

    అదే సమయంలో దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) మాత్రం రూ.2,513 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    స్టాక్ మార్కెట్

    Stock Market: నష్టాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలు..  బిజినెస్
    Stock Market: ఐదో రోజూ లాభాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 557 పాయింట్లు, నిఫ్టీ 159 పాయింట్ల లాభం  బిజినెస్
    Upcoming IPOs: దలాల్‌ స్ట్రీట్‌లో ఐపీఓల హడావిడి.. వచ్చే వారంలో 4 కొత్త సబ్‌స్క్రిప్షన్లు! ఐపీఓ
    Stock Market: లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్ సూచీలు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025