Page Loader
Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు
నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

Stock Market: నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2024
04:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలు నేడు వెలువడనుండటంతో మార్కెట్‌లో తీవ్ర ఒడుదొడుకులు వచ్చాయి. ఈ పరిస్థితిలో ప్రధాన షేర్లలో అమ్మకాలు కూడా సూచీలపై ఒత్తిడి పెంచాయి. ఈ కారణంగా సెన్సెక్స్ 502 పాయింట్లు, నిఫ్టీ 137 పాయింట్లు నష్టపోయాయి. సెన్సెక్స్ ఉదయం 80,666.26 పాయింట్ల వద్ద ప్రారంభమైంది (మునుపటి ముగింపు 80,684.45) మరియు కొద్ది సేపు లాభాల్లో కదలాడినా, తరువాత నష్టాల్లోకి జారుకుంది. ఈ సూచీ ఏ దశలోనూ కోలుకోలేదు. ఇంట్రాడేలో 80,050.07 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 502 పాయింట్ల నష్టంతో 80,182.20 వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ 137 పాయింట్ల నష్టంతో 24,198 వద్ద ముగిసింది.

వివరాలు 

బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.67 డాలర్లు

సెన్సెక్స్ 30 (SENSEX-30) సూచీలో టాటా మోటార్స్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్అండ్‌టీ, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టపోయాయి. టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్‌ఫార్మా, టెక్ మహీంద్రా, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ వంటి కొన్ని షేర్లు మాత్రం లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 73.67 డాలర్లు, బంగారం ఔన్సు ధర 2,661 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.