NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market : లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market : లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ
    లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ

    Stock Market : లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 23, 2025
    10:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ఉదయం స్థిరంగా ప్రారంభమైనా,తర్వాతి సమయంలో కీలక షేర్లలో కొనుగోళ్లతో సూచీలు లాభాల్లోకి దూసుకెళ్లాయి.

    అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మదుపర్లు కొంత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 235 పాయింట్లు పెరిగి 81,251 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 114 పాయింట్ల లాభంతో 24,728 స్థాయిలో కొనసాగుతోంది.

    సెన్సెక్స్‌లోని 30 షేర్లలో ఎటర్నల్, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, ఐటీసీ, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్‌సర్వ్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, నెస్లే ఇండియా, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్ లాంటి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    కాగా, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా (ఎంఅండ్‌ఎం), టైటాన్ షేర్లు నష్టాల్లో కదలాడుతున్నాయి.

    వివరాలు 

    బంగారం ధర ఔన్సుకు 3,298 డాలర్లు 

    అంతర్జాతీయ మార్కెట్ల విషయానికొస్తే, బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 60.85 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ధర ఔన్సుకు 3,298 డాలర్ల వద్ద ఉంది.

    రూపాయి మారకం విలువ డాలరుతో పోలిస్తే 86.10 వద్ద ప్రారంభమైంది.

    అమెరికాలోని స్టాక్ మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి.నాస్‌డాక్ సూచీ 0.28 శాతం లాభపడి ముగిసినప్పటికీ, ఎస్‌ అండ్‌ పీ 500, డోజోన్స్ సూచీలు స్వల్పంగా నష్టపోయాయి.

    ఆసియా-పసిఫిక్ మార్కెట్లు శుక్రవారం లాభాల్లో కొనసాగుతున్నాయి.

    వివరాలు 

    రూ.5,045 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయం 

    ఆస్ట్రేలియా ఏఎస్‌ఎక్స్‌ 0.26 శాతం, జపాన్ నిక్కీ 0.80 శాతం, హాంగ్‌సెంగ్ 0.76 శాతం, షాంఘై మార్కెట్ 0.21 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గురువారం విక్రయదారులుగా వ్యవహరించగా, రూ.5,045 కోట్ల విలువైన షేర్లను నికరంగా విక్రయించారు.

    దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.3,715 కోట్ల షేర్లను నికరంగా కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Stock Market : లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    Kavitha: 'భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు'.. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్‌కు కవిత లేఖ!  కల్వకుంట్ల కవిత
    Bangladesh: బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేత మహమ్మద్ యూనస్ రాజీనామా యోచన బంగ్లాదేశ్
    Trump: హార్వర్డ్‌ యూనివర్సిటీకి ట్రంప్‌ మరో పెద్ద షాక్‌.. విదేశీ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం అమెరికా

    స్టాక్ మార్కెట్

    Stock market: వెయ్యి పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌.. రిలయన్స్‌ షేరు 5శాతం పెరుగుదల వ్యాపారం
    Stock Market : లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు  బిజినెస్
    Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా? బిజినెస్
    Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 70 పాయింట్లు, నిఫ్టీ 7 పాయింట్ల లాభం  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025