NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ @ 22,920 
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ @ 22,920 
    లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ @ 22,920

    Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్ 250 పాయింట్లు, నిఫ్టీ @ 22,920 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 07, 2024
    10:08 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మానిటరీ పాలసీ కమిటీ సమావేశానికి ముందు శుక్రవారం స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ ఒడిదుడుకులతో ప్రారంభమైంది.

    ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 100 పాయింట్లు జారి 75,000 పాయింట్ల దిగువకు చేరుకుంది. మరోవైపు నిఫ్టీ కూడా 22,800 స్థాయికి చేరుకుంది.

    అయితే, ప్రధాన బెంచ్‌మార్క్ సూచీలు తమ నష్టాలను పూడ్చుకోగలిగాయి, మార్కెట్ తిరిగి ఊపందుకుంది.

    ఉదయం 9.40 గంటలకు సెన్సెక్స్ 386.02 (0.51%) పాయింట్ల లాభంతో 75,460.53 వద్ద ట్రేడవుతోంది.

    మరోవైపు నిఫ్టీ 121.55 (0.53%) పాయింట్లు బలపడి 22,942.95 స్థాయికి చేరుకుంది. ప్రారంభ ట్రేడింగ్‌లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 7 పైసలు పెరిగి రూ.83.46కు చేరుకుంది.

    Details 

    మిశ్రమంగా ముగిసిన అమెరికా మార్కెట్లు

    సెన్సెక్స్‌-30 (Sensex) సూచీలో విప్రో,టెక్‌ మహీంద్రా,ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌,హెచ్‌సీఎల్‌ టెక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, టీసీఎస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, టాటా మోటార్స్, టైటన్‌, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి.

    ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎల్‌ అండ్‌ టీ,కోటక్ మహీంద్రా బ్యాంక్‌,ఐటీసీ,భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

    అమెరికా మార్కెట్లు గురువారం మిశ్రమంగా ముగిశాయి.యురోపియన్‌ సెంట్రల్‌ బ్యాంకు 25 పాయింట్ల మేర వడ్డీ రేట్లు తగ్గించిన నేపథ్యంలో నేడు ఆసియా-పసిఫిక్‌ సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.

    ఇంటర్నేషనల్ మార్కెట్‌లో బ్యారెల్‌ బ్రెంట్‌ ఆయిల్ ధర 79.99 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.విదేశీ సంస్థాగత మదుపర్లు(FIIs)గురువారం నికరంగా రూ.6,868 కోట్లు విలువ చేసే షేర్లను అమ్మేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు(DIIs)రూ.1,566 కోట్ల వాటాలను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Ferrari 12 Cilindri: పవర్‌ఫుల్ ఫెరారీ వచ్చేసింది.. 'సిలిండ్రీ' బుకింగ్స్ స్టార్ట్! ఫెరారీ
    Operation Sindoor Outreach: ఆపరేషన్‌ సిందూర్‌ నేపథ్యంలో.. నేటినుంచి విదేశీ పర్యటనను ప్రారంభించనున్న అఖిలపక్ష బృందాలు  ఆపరేషన్‌ సిందూర్‌
    Sushmita Sen: 31 ఏళ్ల క్రితం ఫొటో షేర్‌ చేసిన మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్
    Shaktimaan: 'శక్తిమాన్‌' మరోసారి వస్తున్నాడు.. ఆడియో సిరీస్‌గా వచ్చేస్తున్న సూపర్‌హీరో! సినిమా

    స్టాక్ మార్కెట్

    నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 299.48, నిఫ్టీ 72.65 పాయింట్ల క్షీణత  సెన్సెక్స్
    స్టాక్ మార్కెట్లో ఆవిరైన లాభాలు.. నష్టాలతో ముగిసిన నిఫ్టీ, సెన్సెక్స్  సెన్సెక్స్
    మళ్లీ నిరాశపరిచిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ సెన్సెక్స్
    Stock Market : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు ప్రపంచం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025