
Stock market: వరుసగా రెండోసెషన్లో నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్లు.. 24,800 పాయింట్ల కంటే దిగువన నిఫ్టీ
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజూ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ సూచీ 24,800 పాయింట్ల కంటే తక్కువ స్థాయిలో ముగియగా, సెన్సెక్స్ 296 పాయింట్లకుపైగా పడిపోయింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సుంకాల నేపథ్యంలో మార్కెట్లపై ఒత్తిడి ఏర్పడింది. ఆయన ఆగస్టు 1వ తేదీ నుండి భారత్ నుంచి వచ్చే అన్ని వస్తువులపై 25 శాతం సుంకాలు విధించనున్నట్టు ప్రకటించారు. అంతేకాక, రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న చమురు,సైనిక ఆయుధాలపై కూడా సుంకాలు విధించనున్నట్టు ట్రంప్ తెలిపారు. ఈ పరిణామాల ప్రభావంతో గురువారం ఉదయం మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఏ దశలోనూ సూచీలు మళ్లీ పుంజుకోలేదు.
వివరాలు
లాభంలో 1,490 షేర్లు.. నష్టాలలో 2,365 షేర్లు
ఉదయం 80,695.50 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 81,803.27 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. అయితే, తర్వాత 80,695.15 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. చివరికి ఇది 296.28 పాయింట్లు కోల్పోయి 81,185.58 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 86.70 పాయింట్లు నష్టపోయి 24,768.35 పాయింట్ల స్థాయిలో కొనసాగింది. మార్కెట్లో మొత్తం 1,490 షేర్లు లాభపడగా, 2,365 షేర్లు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీలో హెచ్యూఎల్, జియో ఫైనాన్షియల్, ఎటర్నల్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఐటీసీ లాభాల్లో నిలిచాయి. అయితే, అదానీ ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, సన్ ఫార్మా షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
వివరాలు
ఐటీ, మెటల్ రంగాలు కూడా 1.4 శాతం వృద్ధి
బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు ఒక్కోటి సుమారు 0.7 శాతం మేర తగ్గాయి. రంగాల వారీగా చూస్తే, ఎఫ్ఎంసీజీ రంగం 1.4 శాతం మేర లాభపడింది. ఐటీ, మెటల్ రంగాలు కూడా 1.4 శాతం వృద్ధి చూపాయి. కానీ ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్యూ బ్యాంకులు, ఫార్మా, రియల్టీ, టెలికాం రంగాలు 0.5 శాతం నుంచి 1.8 శాతం మధ్య నష్టపోయాయి.