NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌..
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌..
    లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌..

    Stock Market: లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 300 పాయింట్లు జంప్‌..

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 05, 2025
    04:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్ రంగాన్ని తప్పితే మిగతా అన్ని రంగాల్లోనూ కొనుగోళ్ల జోరు కనిపించింది.

    గత ట్రేడింగ్ సెషన్‌తో పోలిస్తే మార్కెట్‌ స్వల్ప లాభాలతో ప్రారంభమైంది.

    సెన్సెక్స్‌ 80,661.62 పాయింట్ల వద్ద ప్రారంభమై, అదే ధోరణిని ట్రేడింగ్ ముగిసే వరకు కొనసాగించింది.

    ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ కనిష్ఠంగా 80,657.71 పాయింట్లను తాకగా, గరిష్ఠంగా 81,049.03 పాయింట్లను అధిగమించింది.

    చివరికి ఈ సూచీ 294.85 పాయింట్లు పెరిగి 80,796.84 పాయింట్ల వద్ద స్థిరపడింది.

    నిఫ్టీ సూచీ 114.45 పాయింట్లు లాభపడి 24,461.15 వద్ద ముగిసింది.

    మొత్తంగా మార్కెట్లో దాదాపు 2,462 షేర్లు లాభాల్లో నమోదవ్వగా, 1,404 షేర్లు నష్టపోయాయి. మరో 171 షేర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు.

    వివరాలు 

    మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఒక్కోటి ఒక శాతం కంటే ఎక్కువ పెరిగాయి 

    బీఎస్‌ఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు ఒక్కోటి ఒక శాతం కంటే ఎక్కువ పెరిగాయి.

    బ్యాంకింగ్ రంగాన్ని మినహాయిస్తే, ఆటోమొబైల్, పవర్, ఎనర్జీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్స్, ఎఫ్‌ఎంసీజీ, ఆయిల్ & గ్యాస్ రంగాలన్నీ దాదాపు ఒక శాతం చొప్పున లాభపడ్డాయి.

    నిఫ్టీలో అదానీ పోర్ట్స్, అదానీ ఎంటర్‌ప్రైజెస్, ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎంఅండ్‌ఎం కంపెనీలు అత్యధిక లాభాలు నమోదు చేశాయి.

    మరోవైపు, కొటక్ మహీంద్రా బ్యాంక్, ఓఎన్‌జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, జెఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎస్‌బీఐ షేర్లు నష్టాల్లో ముగిశాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    స్టాక్ మార్కెట్

    stock Market: భారీ నష్టాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభం  .. సెన్సెక్స్‌ 3000 పాయింట్లు డౌన్‌ బిజినెస్
    Black Monday 2.0: 1987 మార్కెట్ క్రాష్‌లో ఏం జరిగింది? నిపుణులు మరో 'రక్తపాతం' గురించి ఎందుకు హెచ్చరిస్తున్నారు బిజినెస్
    Black Monday: భారీ నష్టాలలో భారత స్టాక్‌ మార్కెట్లు..సెన్సెక్స్‌ 2,220 పాయింట్లు పతనం  బిజినెస్
    Stock Market: సేఫ్.. కోలుకున్న మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు జంప్‌ బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025