Page Loader
Stock market: భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1100 పాయింట్లు జంప్ 
భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు

Stock market: భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1100 పాయింట్లు జంప్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 17, 2025
01:15 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ సూచీలు ప్రారంభంలో నష్టాల్లోనే ట్రేడింగ్‌ ప్రారంభించాయి. అయితే మధ్యాహ్నం తరువాత మళ్లీ గట్టిగా పుంజుకొని మునుపటి నష్టాలను తీర్చాయి. ముఖ్యంగా బ్యాంకింగ్‌ రంగానికి చెందిన షేర్లలో కొనుగోళ్లకు ఊతమిచ్చే విధంగా పెట్టుబడిదారులు ఆసక్తిని చూపడంతో మార్కెట్‌లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఇందులోనూ ముఖ్యంగా ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్ల దూకుడుతో సూచీలు వేగంగా రికవరీ అయ్యాయి. ఫలితంగా సెన్సెక్స్‌ దాదాపు 1100 పాయింట్ల వరకు లాభాల్లో కొనసాగుతుండగా, నిఫ్టీ 23,700 పాయింట్లకు పైగా ట్రేడవుతోంది.

వివరాలు 

ప్రతికూల సంకేతాల వల్ల సూచీలు స్థిరంగా..

ఉదయం ట్రేడింగ్‌ ప్రారంభంలో ఐటీ రంగానికి చెందిన షేర్లపై అమ్మకాలు కొనసాగడంతో పాటు, గ్లోబల్ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల వల్ల సూచీలు స్థిరంగా ప్రారంభమయ్యాయి. కానీ అనంతరం మార్కెట్‌ దశలవారీగా పుంజుకొని గణనీయమైన లాభాలను నమోదు చేసింది. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సెన్సెక్స్‌ 1,097.75 పాయింట్ల లాభంతో 78,142.04 వద్ద కొనసాగుతుండగా, నిఫ్టీ కూడా 300.85 పాయింట్లు పెరిగి 23,738.05 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌లో భాగమైన ప్రధాన షేర్లలో జొమాటో (ఎటర్నల్‌), భారతీ ఎయిర్‌టెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, సన్‌ఫార్మా లాంటి షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. మరోవైపు ఎల్‌అండ్‌టీ, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు మాత్రం నష్టాల్లో కొనసాగుతున్నాయి.