English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్‌
    నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు..

    Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 22, 2025
    10:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

    ఈ నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, రిలయన్స్‌, ఐటీసీ వంటి కీలక షేర్లలో అమ్మకాలు జరగడం సూచీలపై ప్రతికూల ప్రభావం చూపుతోంది.

    దీంతో ప్రారంభ సమయంలోనే సెన్సెక్స్‌ సుమారు 400 పాయింట్ల మేర నష్టపోయింది. అనంతరం అది మరింతగా నష్టాల్లోకి జారుకుంటోంది.

    ఉదయం 9:26 గంటల సమయంలో, సెన్సెక్స్‌ 678 పాయింట్ల నష్టంతో 80,918 వద్ద, నిఫ్టీ 207 పాయింట్ల నష్టంతో 24,605 వద్ద ట్రేడవుతున్నాయి.

    వివరాలు 

    సెన్సెక్స్‌-30 సూచీ

    సెన్సెక్స్‌-30 సూచీలో టెక్‌ మహీంద్రా, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, నెస్లే ఇండియా, హెచ్‌యూఎల్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌, మారుతీ సుజుకీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

    అయితే అదానీ పోర్ట్స్‌,టాటా స్టీల్‌,ఎన్టీపీసీ షేర్లు మాత్రమే లాభాల్లో కదలాడుతున్నాయి.

    ఇక అమెరికా స్టాక్‌ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి.ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 1.61 శాతం, డోజోన్స్‌ 1.91 శాతం,నాస్‌డాక్‌ 1.41 శాతం మేర నష్టపోయాయి.

    ఆసియా-పసిఫిక్‌ మార్కెట్లూ ఈ నేఫథ్యంలో అదే దారిలో కొనసాగుతున్నాయి.

    ఆస్ట్రేలియాలోని ఏఎస్‌ఎక్స్‌ 0.50 శాతం నష్టంలో ఉండగా,జపాన్‌ నిక్కీ 0.89 శాతం,హాంగ్‌సెంగ్‌ 0.70 శాతం,0.35 శాతం నష్టాల్లో ట్రేడవుతున్నాయి.షాంఘై సూచీ మాత్రం స్థిరంగా కదులుతోంది.

    మీరు
    50%
    శాతం పూర్తి చేశారు

    వివరాలు 

    బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 64.86 డాలర్లు 

    అంతర్జాతీయ మార్కెట్లలో బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 64.86 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు ధర 3,342 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చితే 85.61 వద్ద ప్రారంభమైంది. విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) మళ్లీ కొనుగోలుదారులుగా మారారు.

    బుధవారం ఒక్కరోజే వారు నికరంగా రూ.2,202 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) కూడా నికరంగా రూ.684 కోట్ల షేర్లను కొనుగోలు చేశారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    స్టాక్ మార్కెట్

    Stock Market: లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు.. నిఫ్టీ 24,100 వద్ద ట్రేడవుతున్న సూచీలు వ్యాపారం
    Stock market: వెయ్యి పాయింట్లు దూసుకెళ్లిన సెన్సెక్స్‌.. రిలయన్స్‌ షేరు 5శాతం పెరుగుదల వ్యాపారం
    Stock Market : లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు  బిజినెస్
    Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా? బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025