Page Loader
Stock market: లాభాల్లో ప్రారంభమై… ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు
లాభాల్లో ప్రారంభమై… ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

Stock market: లాభాల్లో ప్రారంభమై… ఫ్లాట్‌గా ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 22, 2025
04:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

క్యూ1 ఫలితాల ప్రభావంతో ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్‌ సూచీలు చివరికి స్థిరంగా ముగిశాయి. ఎటెర్నల్‌,ఐసీఐసీఐ బ్యాంక్‌,హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ షేర్లలో కొనుగోళ్లకు మద్దతు లభించడం సూచీలకు ఉపశమనంగా పనిచేసింది. కానీ, అమెరికాతో ట్రేడ్ డీల్‌పై ఇంకా స్పష్టత రాకపోవడం,ట్రంప్‌ నిర్ణయించిన గడువు ఆగస్టు 1కు దగ్గరపడటం వలన మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఈ పరిస్థితుల మధ్య సూచీలు స్వల్ప నష్టాలతో ముగిశాయి.సెన్సెక్స్‌ ఉదయం 82,527.43 పాయింట్ల వద్ద (గత ముగింపు 82,200.34) లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 82,110.63 నుంచి 82,538.17పాయింట్ల మధ్య ఊగిసలాడిన సూచీ చివరికి 13.53 పాయింట్ల నష్టంతో 82,186.81వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 29.80 పాయింట్లు తగ్గి 25,060వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 86.36గా కొనసాగుతోంది.

వివరాలు 

బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 68.49 డాలర్లు 

సెన్సెక్స్‌ 30 షేర్ల జాబితాలో ఎటెర్నల్‌, టైటాన్‌, బీఈఎల్‌, మారుతీ సుజుకీ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు లాభాలను నమోదు చేశాయి. అయితే టాటా మోటార్స్‌, అదానీ పోర్ట్స్‌, ఎస్‌బీఐ, రిలయన్స్‌, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 68.49 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా, బంగారం ఔన్సు ధర 3,396 డాలర్ల వద్ద కొనసాగుతోంది.