NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ
    లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ

    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 23, 2025
    04:27 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఈ రోజు గణనీయమైన లాభాలతో ముగిశాయి. గత రోజున భారీగా నష్టాలు నమోదైన సూచీలు, ఈ రోజు దాదాపు అదే స్థాయిలో పుంజుకున్నాయి.

    అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన బాండ్లపై ఆదాయాలు కొంత తగ్గడమే మార్కెట్‌కు అనుకూలంగా మారింది.

    ముఖ్యంగా ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, ఫైనాన్షియల్స్, బ్యాంకింగ్‌ రంగాల్లోకి పెట్టుబడులు రావడంతో ఆయా రంగాల షేర్లు బాగా పెరిగాయి.

    నిఫ్టీ మిడ్‌క్యాప్‌ 100, స్మాల్‌క్యాప్‌ 100 సూచీలు కూడా మితమైన లాభాలను నమోదు చేశాయి.

    ఈ నేపథ్యంలో ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఒక దశలో 900 పాయింట్ల మేర లాభపడగా, నిఫ్టీ మళ్లీ 24,800 పాయింట్లకు పైగా స్థిరపడింది.

    వివరాలు 

     డాలరుతో పోల్చితే 72 పైసలు బలపడి 85.23 వద్ద రూపాయి 

    సెన్సెక్స్‌ ఈ ఉదయం 80,897.00 పాయింట్ల వద్ద (మునుపటి ముగింపు స్థాయి 80,951.99) స్వల్ప నష్టాలతో ప్రారంభమైంది.

    కాసేపటికే అది లాభాల బాట పట్టి, రోజంతా అదే ధోరణి కొనసాగింది.ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఇది గరిష్ఠంగా 81,905.17 పాయింట్లకు చేరింది.

    చివరికి ఇది 769.09 పాయింట్ల లాభంతో 81,721.08 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 243.45 పాయింట్ల లాభంతో 24,853.15 వద్ద స్థిరమైంది.

    రూపాయి విలువ డాలరుతో పోల్చితే 72 పైసలు బలపడి 85.23 వద్ద నిలిచింది.

    వివరాలు 

    బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 64.38 డాలర్లు 

    సెన్సెక్స్‌ 30 స్టాక్స్‌లో సన్‌ఫార్మాను మినహాయిస్తే మిగిలిన అన్ని కంపెనీల షేర్లు లాభాల్లో ముగిశాయి.

    ముఖ్యంగా ఎటర్నల్‌, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, ఐటీసీ, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ షేర్లలో కీలకంగా కొనుగోళ్లు నమోదయ్యాయి.

    అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 64.38 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 3,327 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్ సూచీలు.. 24,800 ఎగువకు నిఫ్టీ స్టాక్ మార్కెట్
    IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్..  ఐపీఎల్
    Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్  ఉత్తర్‌ప్రదేశ్
    War 2: హృతిక్, ఎన్టీఆర్‌ 'వార్‌ 2'.. దర్శకుడు అయాన్ ముఖర్జీ మొదటి పోస్ట్.. ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి  జూనియర్ ఎన్టీఆర్

    స్టాక్ మార్కెట్

    Akshaya Tritiya: అక్షయ తృతీయ రోజు స్టాక్ మార్కెట్ ఓపెన్ ఉంటుందా? బిజినెస్
    Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 70 పాయింట్లు, నిఫ్టీ 7 పాయింట్ల లాభం  బిజినెస్
    Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు..  బిజినెస్
    Stock Market: స్వల్పంగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025