NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో.. నిఫ్టీ 22,900 వద్ద ట్రేడింగ్
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock Market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో.. నిఫ్టీ 22,900 వద్ద ట్రేడింగ్
    స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో.. నిఫ్టీ 22,900 వద్ద ట్రేడింగ్

    Stock Market: స్టాక్‌ మార్కెట్‌ సూచీలు లాభాల్లో.. నిఫ్టీ 22,900 వద్ద ట్రేడింగ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 28, 2025
    09:54 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాలు ఉన్నా, ప్రధాన షేర్లలో కొనుగోలుకు మదుపర్లు ఆసక్తి చూపడంతో సూచీలు మంచి ప్రదర్శనను ఇచ్చాయి.

    హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు సూచీలకు సానుకూలంగా నిలిచాయి.

    ఈ నేపథ్యంలో సూచీలు ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 250 పాయింట్లు పెరిగి ట్రేడింగ్‌ను ప్రారంభించగా, నిఫ్టీ 22,950 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.

    ఉదయం 9:30 గంటల సమయంలో, సెన్సెక్స్‌ 310 పాయింట్ల లాభంతో 75,676 వద్ద ట్రేడవుతోంది, నిఫ్టీ 70 పాయింట్లు పెరిగి 22,899 వద్ద ఉంది.

    Details

    లాభాల్లో జొమాటో షేర్లు

    సెన్సెక్స్‌ 30 సూచీలో, యాక్సిస్‌ బ్యాంక్‌, బజాజ్‌ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, టాటా స్టీల్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, జొమాటో షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.

    సన్‌ఫార్మా, ఎంఅండ్‌ఎం, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, మారుతీ సుజుకీ, ఐటీసీ, ఎల్‌అండ్‌టీ షేర్లు నష్టాల కింద ట్రేడవుతున్నాయి.

    అంతర్జాతీయ మార్కెట్లో, బ్రెంట్‌ క్రూడ్ బ్యారెల్‌ ధర 73.14 డాలర్ల వద్ద కొనసాగుతుండగా, బంగారం ఔన్సు ధర 2,742.90 డాలర్ల వద్ద కదలాడుతోంది.

    Details

    మిశ్రమంగా ట్రేడవుతున్న అసియా-పసిఫిక్ ప్రధాన సూచీలు

    అమెరికాలో వాణిజ్య విధానంపై అనిశ్చితి కారణంగా సోమవారం అక్కడి మార్కెట్లు భారీగా పడిపోయాయి. ఎస్‌అండ్‌పీ 500 1.46 శాతం, నాస్‌డాక్‌ 3.07 శాతం క్షీణించాయి.

    ఆసియా-పసిఫిక్‌ ప్రధాన సూచీలు ఈ రోజు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

    విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) గత ట్రేడింగ్‌ సెషన్‌లో రూ.5,015 కోట్ల విలువైన షేర్లను విక్రయించగా, దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) నికరంగా రూ.6,642 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    స్టాక్ మార్కెట్

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న సూచీలు.. నిఫ్టీ 23,750 బిజినెస్
    Stock Market: భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్‌ 1000+.. బిజినెస్
    Stock Market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. ₹6 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద బిజినెస్
    Stock Market: ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,150 దిగువన ట్రేడవుతున్న నిఫ్టీ  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025