
Stock Market: లాభాల్లో దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,591
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి. ఉదయం 9:19 నిమిషాలకు బిఎస్ఇ సెన్సెక్స్ సూచీ 136 పాయింట్ల పెరుగుదలతో 83,893 వద్ద ట్రేడవుతుండగా, ఎన్ఎస్ఇ నిఫ్టీ సూచీ 43 పాయింట్లు పెరిగి 25,591 స్థాయిలో కొనసాగుతోంది. ఈ సమయంలో హూస్టన్ ఆగ్రో ప్రొడక్ట్స్, పెట్రోనెట్ ఎల్ఎన్జీ, అపర్ ఇండస్ట్రీస్, డిక్సన్ టెక్నాలజీస్ షేర్లు లాభాలను నమోదు చేస్తున్నాయి. మరోవైపు, అల్ఖ్యాల్ అమినీస్ కెమికల్స్, జేకే సిమెంట్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఎంటీఎన్ఎల్ కంపెనీల షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.
వివరాలు
ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్ కాంట్రాక్టులపై ఎన్ఎస్ఈ ప్రకటన
వచ్చే రెండు నుంచి మూడు వారాల్లో నెలవారీ ఎలక్ట్రిసిటీ ఫ్యూచర్స్ కాంట్రాక్టులను ప్రవేశపెట్టనున్నట్లు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ) గురువారం ప్రకటించింది. విద్యుత్ కొనుగోలుదారులు, అమ్మకందారులు, ట్రేడర్లు, పారిశ్రామిక విభాగాలు,రిటెయిలర్లకు ధరల ఊగిసలాట ప్రభావాన్ని తగ్గించేందుకు ఈ కాంట్రాక్టులు ఎంతో ఉపయోగపడతాయని ఎన్ఎస్ఈ స్పష్టం చేసింది. స్వల్పంగా బలపడిన రూపాయి మారకం విలువ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ స్వల్పంగా బలపడింది. గురువారం మార్కెట్ ముగిసే సమయానికి డాలర్తో రూపాయి మారకం విలువ రూ.85.70గా ఉండగా, ఈ రోజు ప్రారంభంలో అది రూ.85.50కి మెరుగుపడింది.
వివరాలు
ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో మిశ్రమ రీతిలో ట్రేడింగ్
ఆసియా-పసిఫిక్ దేశాల ప్రధాన సూచీలు ఈరోజు మిశ్రమంగా ట్రేడింగ్ను ప్రారంభించాయి. చైనా షాంఘై సూచీ, దక్షిణ కొరియా కోస్పీ సూచీ నష్టాల్లో కొనసాగుతుండగా, జపాన్ నిక్కీ, ఆస్ట్రేలియా ఏసీఎక్స్, న్యూజిలాండ్ ఎన్జెడ్ఎక్స్ 50 సూచీలు లాభాల్లో కొనసాగుతున్నాయి.