Page Loader
Stock market: ఫ్లాట్‌గా కదలాడుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,471
ఫ్లాట్‌గా కదలాడుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,471

Stock market: ఫ్లాట్‌గా కదలాడుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,471

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 08, 2025
10:11 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నాడు స్థిరంగా ప్రారంభమయ్యాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన అభివృద్ధుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షితంగా వ్యవహరిస్తుండటంతో మార్కెట్లు వరుసగా రెండోరోజు స్తబ్దుగా కదలాడుతున్నాయి. ఉదయం 9.33 గంటల సమయంలో సెన్సెక్స్ 46 పాయింట్ల వృద్ధితో 83,485 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 25,471 వద్ద కొనసాగుతోంది. అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 85.71గా నమోదైంది.

వివరాలు 

 14 దేశాలపై సుంకాలు 

నిఫ్టీ సూచీలో కొటక్ మహీంద్రా, ఎటర్నల్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఓఎన్‌జీసీ, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా, టైటాన్ కంపెనీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, సన్ ఫార్మా వంటి స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ముగియగా, ఈ రోజు ఆసియా-పసిఫిక్ మార్కెట్లలో మిశ్రమ ధోరణి కనిపిస్తోంది. ట్రంప్ మరోసారి దిగుమతులపై సుంకాలు విధించే హెచ్చరికలు జారీ చేయడంతో ఆ మార్కెట్లు ఊగిసలాటలో పడ్డాయి. తాజాగా 14 దేశాలపై సుంకాలు విధించినట్టు సమాచారం. మరోవైపు భారత్‌తో వాణిజ్య ఒప్పందం త్వరలోనే కుదిరే అవకాశముందని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు.