NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్‌ దాటిన నిఫ్టీ
    తదుపరి వార్తా కథనం
    Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్‌ దాటిన నిఫ్టీ
    లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్‌ దాటిన నిఫ్టీ

    Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్‌ దాటిన నిఫ్టీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 26, 2025
    10:06 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్లు సోమవారం లాభాలతో ట్రేడింగ్‌ ప్రారంభించాయి.

    కార్పొరేట్ కంపెనీల ఆర్థిక ఫలితాలు,అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన సంకేతాల ప్రభావంతో ఈ వారం పాజిటివ్ నోటుతో మొదలైంది.

    నిఫ్టీ సూచీ 25,000 మార్కును అధిగమించింది. నెలవారీ డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగియనున్న నేపథ్యంలో మార్కెట్ లాభాలదిశగా కొనసాగింది,ఇది మార్కెట్ అంచనాలకు అనుగుణంగా ఉంది.

    ఉదయం 9:29 గంటలకు సెన్సెక్స్‌ 639 పాయింట్లు పెరిగి 82,360 వద్ద ట్రేడవుతున్నది. అదే సమయంలో నిఫ్టీ 195 పాయింట్ల లాభంతో 25,048 వద్ద కొనసాగింది.

    రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 44 పైసలు పెరిగి 85.01 వద్ద ఉంది. నిఫ్టీలోని ప్రధాన షేర్లలో ఎంఅండ్‌ఎం, పవర్‌ గ్రిడ్ కార్పొరేషన్, హిందాల్కో,టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ లాభాలతో కదలాడుతున్నాయి.

    వివరాలు 

    ద్విచక్ర వాహనాలు,ట్రాక్టర్ల తయారీ కంపెనీలపై మదుపర్ల దృష్టి

    అయితే ఎటర్నల్‌ మరియు సిప్లా షేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడింగ్ ప్రారంభించాయి. ఆసియా మార్కెట్లు మిశ్రమ ధోరణి కనబర్చగా,శుక్రవారం అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.

    ఇదిలా ఉండగా,యూరోపియన్ యూనియన్(ఈయూ)దేశాలపై సుంకాల అంశంలో ట్రంప్ వెనక్కి తగ్గారు.

    వాణిజ్య చర్చల గడువును జులై 9 వరకు పొడిగించారు.గతంలో ట్రంప్ ఈయూ దేశాలపై 50 శాతం సుంకాలు విధిస్తామని,జూన్ 1 నుండి కొత్త టారిఫ్‌లు అమల్లోకి వస్తాయని ప్రకటించిన విషయం తెలిసిందే.

    ఇక రుతుపవనాల ప్రభావంతో ద్విచక్ర వాహనాలు,ట్రాక్టర్ల తయారీ కంపెనీలపై మదుపర్ల దృష్టి ఎక్కువగా ఉండనుంది.

    ఇప్పటికే అరబిందో ఫార్మా,సుందరం ఫైనాన్స్,బేయర్ క్రాప్‌సైన్స్,ఒలెక్ట్రా గ్రీన్‌టెక్,నజారా టెక్నాలజీస్,శిల్పా మెడికేర్,జీఐసీ,పవర్‌గ్రిడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ బోర్డు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో మదుపర్లు ఈ కంపెనీలపై దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ మార్కెట్లు.. 25వేల మార్క్‌ దాటిన నిఫ్టీ స్టాక్ మార్కెట్
    Himanta Biswa Sarma: బంగ్లాదేశ్‌కు రెండు 'చికెన్ నెక్'లు ఉన్నాయ్.. అవి మరింత బలహీనం  హిమంత బిస్వా శర్మ
    Trump-Putin: రష్యా అధ్యక్షుడుపై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం.. పుతిన్ పిచ్చివాడంటూ ఘాటు విమర్శలు  డొనాల్డ్ ట్రంప్
    PBKS vs MI: ఆసక్తికర పోరుకు రంగం సిద్ధం.. జైపూర్ వేదికగా తలపడనున్న పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ ఐపీఎల్

    స్టాక్ మార్కెట్

    Stock market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 70 పాయింట్లు, నిఫ్టీ 7 పాయింట్ల లాభం  బిజినెస్
    Stock Market : ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు..  బిజినెస్
    Stock Market: స్వల్పంగా నష్టపోయిన దేశీయ మార్కెట్లు  బిజినెస్
    Stock Market: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాల నడుమ.. లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025