Page Loader
Stock market: ఫ్లాట్‌గా కదలాడుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,436
ఫ్లాట్‌గా కదలాడుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,436

Stock market: ఫ్లాట్‌గా కదలాడుతోన్న దేశీయ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ@ 25,436

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 10, 2025
10:02 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి స్థిరంగా ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి స్పష్టతలేని సంకేతాల మధ్య, భారత సూచీలు స్వల్పంగా నష్టాల్లో కదలాడుతున్నాయి. ఉదయం 9:32 గంటల సమయానికి సెన్సెక్స్ 91 పాయింట్లు తగ్గి 83,430 వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో నిఫ్టీ 39 పాయింట్ల నష్టంతో 25,436 స్థాయిలో కొనసాగుతోంది. రూపాయి మారకం విలువ అమెరికన్ డాలర్‌తో పోల్చుకుంటే 85.61 వద్ద నమోదు అయ్యింది. నిఫ్టీలో టాటా స్టీల్‌, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో కనిపిస్తున్నాయి. కాగా టాటా మోటార్స్‌, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్‌, విప్రో, అపోలో హాస్పిటల్స్‌, సిప్లా స్టాక్స్ నష్టాలబాటలో సాగుతున్నాయి.

వివరాలు 

బ్రెజిల్‌పై 50 శాతం దిగుమతి సుంకం

ఇతర ఆసియా-పసిఫిక్ మార్కెట్లు కూడా ఈరోజు వ్యత్యాసాలతో ప్రారంభమయ్యాయి. వచ్చే ఆగస్టు 1వ తేదీ నుంచి కొత్త టారిఫ్‌లు అమలులోకి వస్తాయని, ఈ గడువును పొడిగించే ఆలోచన లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాపర్ దిగుమతులపై 50 శాతం దిగుమతి సుంకాన్ని విధించబోతున్నట్లు, అలాగే ఫార్మాస్యూటికల్ ఉత్పత్తులపై కూడా పెద్ద ఎత్తున సుంకాలు విధించే అవకాశముందని ఆయన సూచించడంతో ఆయా రంగాల్లో ఒత్తిడిని కలిగించింది. ఇక తాజాగా బ్రెజిల్‌పై కూడా 50 శాతం దిగుమతి సుంకం విధిస్తున్నట్టు ట్రంప్ వెల్లడించారు.