NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / TCS increments: టీసీఎస్‌ ఉద్యోగులకు 4-8% జీతాల పెంపు 
    తదుపరి వార్తా కథనం
    TCS increments: టీసీఎస్‌ ఉద్యోగులకు 4-8% జీతాల పెంపు 
    టీసీఎస్‌ ఉద్యోగులకు 4-8% జీతాల పెంపు

    TCS increments: టీసీఎస్‌ ఉద్యోగులకు 4-8% జీతాల పెంపు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 17, 2025
    03:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోనే అగ్రగామి ఐటీ సేవల సంస్థగా పేరుగాంచిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS)2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక వేతన పెంపును అమలు చేసేందుకు సిద్ధమవుతోంది.

    అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, ఈ వేతన పెంపు 4% నుంచి 8% వరకు ఉండే అవకాశం ఉంది.

    సవరించిన వేతనాన్ని ఏప్రిల్ నుంచి అమలులోకి తేనున్నారు. ఈ మేరకు ఉద్యోగులకు త్వరలోనే అధికారిక లేఖలు అందనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు.

    మార్చి నెలాఖరులోగా ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన లేఖలు జారీ చేయనున్నట్లు మరో ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ కూడా ఇప్పటికే ప్రకటించింది.

    కొవిడ్-19 మహమ్మారి ప్రభావం పడకముందు టాప్ ఐటీ కంపెనీల్లో వేతన ఇంక్రిమెంట్లు సాధారణంగా రెండంకెల శాతంలో పెరుగుతూ ఉండేవి.

    వివరాలు 

    వేతన పెంపుపై ప్రభావం చూపే అంశాలు 

    అయితే, మహమ్మారి అనంతరం పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ప్రస్తుతం, వేతన పెరుగుదల శాతం సింగిల్ డిజిట్‌కు పరిమితమైందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

    టీసీఎస్ వేతన పెంపు, వేరియబుల్ పే చెల్లింపులను 2024 ప్రారంభంలో ప్రకటించిన రిటర్న్-టు-ఆఫీస్ (RTO) విధానానికి అనుసంధానం చేసింది.

    ఆర్‌టీఓ పాలసీని విధిగా పాటించే ఉద్యోగులకు మరింత ఎక్కువ ఇంక్రిమెంట్లు లభించే అవకాశముందని అంచనా.

    టీసీఎస్, 11.95% నికర లాభ వృద్ధిని నమోదు చేసినప్పటికీ, వేతన పెంపు పరిమితంగానే ఉందని కొందరు విశ్లేషకులు భావిస్తున్నారు.

    డిసెంబర్ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ₹12,380 కోట్లకు చేరగా, మొత్తం ఆదాయం 5.59% వృద్ధితో ₹63,973 కోట్లకు పెరిగింది.

    వివరాలు 

    ఉద్యోగుల అభిప్రాయాలు 

    వేతన పెంపు సానుకూల పరిణామమే అయినప్పటికీ, ఇటీవల సంవత్సరాల్లో ఇంక్రిమెంట్లు తగ్గుముఖం పడుతుండటంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

    2022 ఆర్థిక సంవత్సరంలో సగటు వేతన పెరుగుదల 10.5%గా ఉండగా, 2024 నాటికి ఇది 7-9% మధ్య ఉండే అవకాశముంది.

    అయితే, ఆర్‌టీఓ విధానాన్ని పాటించే వారికి అధిక ప్రోత్సాహకాలు లభించే అవకాశముండటంతో, కొంతమంది ఉద్యోగులు ఊరట వ్యక్తం చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

    తాజా

    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు

    టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్

    భారీ లాభాలను ప్రకటించిన టెక్ దిగ్గజం టీసీఎస్.. ఇకపై కంపెనీలో అలా చేస్తామంటే కుదరదని స్పష్టం  బిజినెస్
    జనరేటివ్ ఏఐలో ట్రైనింగ్ కోసం టీసీఎస్ పెట్టుబడులు.. లక్ష మంది ఉద్యోగులకు సాంకేతిక నైపుణ్య శిక్షణ  బిజినెస్
    TCS scam: లంచాలకు ఉద్యోగాల స్కామ్.. 16మందిని తొలగించిన టీసీఎస్  ఉద్యోగులు
    Tata Group: పాకిస్థాన్ జీడీపీని అధిగమించిన టాటా గ్రూప్ మార్కెట్ విలువ  పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025