NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి
    టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి

    Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 02, 2025
    04:22 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విద్యుత్తు వాహనాల తయారీ రంగంలో ప్రపంచ దిగ్గజం టెస్లా భారతదేశంలో విద్యుత్తు కార్ల తయారీపై ఆసక్తి చూపడం లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్‌.డి. కుమారస్వామి వెల్లడించారు.

    దేశీయంగా కేవలం షోరూమ్‌లు ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో మాత్రమే టెస్లా ముందుకొస్తోందని పేర్కొన్నారు.

    ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యుత్తు వాహనాల తయారీ ప్రోత్సాహక పథకానికి సంబంధించి మార్గదర్శకాలను వెల్లడించారు.

    ఈ సందర్భంగా టెస్లా వ్యవహారంపై స్పందించారు. టెస్లా ఇప్పటివరకు తయారీపై ఏ చిన్న ఆసక్తి చూపలేదు.

    Details

    టెస్లా ప్రతినిధులు హాజరు కాలేదు

    మొదటి రౌండ్‌ చర్చలకు మాత్రమే హాజరయ్యారు. తర్వాత జరిగిన రెండో, మూడో రౌండ్‌ సమావేశాలకు టెస్లా ప్రతినిధులు హాజరుకాలేదని కుమారస్వామి వివరించారు.

    గతేడాది ఏప్రిల్‌లో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌ భారత్ పర్యటనకు రానున్నారని భావించారు. అయితే కంపెనీ పనుల కారణంగా ఆ పర్యటన రద్దు అయింది.

    ట్రంప్ విమర్శలు - మస్క్‌పై అసంతృప్తి

    ఈ ఏడాది ఫిబ్రవరిలో డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఫాక్స్ న్యూస్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్‌లో టెస్లా ఫ్యాక్టరీ ఏర్పాటు అంశాన్ని ప్రస్తావించారు.

    ప్రతి దేశం అమెరికాను వాడుకోవాలని చూస్తోంది. సుంకాల ద్వారా లాభపడాలని చూస్తున్నారు. మస్క్‌ తన కార్లను భారత్‌లో అమ్మాలనుకుంటున్నారు.

    Details

    అమెరికాలో దృష్టిలో అన్యాయం

    అది ఆయనకి సరైనదేమో కానీ, అమెరికా దృష్టిలో మాత్రం అన్యాయమని ట్రంప్‌ విమర్శించారు.

    ఇక తన ప్రధానిగా ఉన్న సమయంలో మోదీతో భేటీ సందర్భంగా ఈ అంశాలను ప్రస్తావించినట్లు ట్రంప్ గుర్తుచేశారు. విద్యుత్తు వాహనాలపై అధిక సుంకాల సమస్యను చర్చించినట్లు తెలిపారు.

    ఈ సమస్యను పరిష్కరించేందుకు, త్వరితగతిన వాణిజ్య ఒప్పందానికి రెండు దేశాలు కృషి చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు.

    యాపిల్‌పై కూడా ట్రంప్ అసంతృప్తి

    భారతదేశంలో తయారవుతున్న ఐఫోన్లపై ట్రంప్‌ అసహనం వ్యక్తం చేశారు. భారత్‌లో తయారైన ఫోన్లు అమెరికాలో అమ్మాలంటే 25 శాతం అదనపు సుంకం తప్పదని యాపిల్ సంస్థకు స్పష్టంగా తెలిపారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టెస్లా

    తాజా

    Tesla: టెస్లా కేవలం షోరూమ్‌ల స్థాపనపై మాత్రమే దృష్టి: కేంద్ర మంత్రి టెస్లా
    AI in 2030: ఏఐ రాక‌తో 2030 నాటికి కొలువులు క‌నుమ‌రుగు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    stock market: స్వల్పనష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు  స్టాక్ మార్కెట్
    Kamal Haasan: 'థగ్ లైఫ్‌' విడుదల కోసం హైకోర్టును ఆశ్రయించిన కమల్‌ హాసన్‌! కమల్ హాసన్

    టెస్లా

    Tesla : 20 లక్షల కార్లను రీకాల్ చేయనున్న టెస్లా.. ఎందుకంటే? ఎలాన్ మస్క్
    Tesla: గత నెలలో దక్షిణ కొరియాలో కేవలం ఒక్క కారునే విక్రయించిన టెస్లా..ఎందుకంటే..? ఆటోమొబైల్స్
    Tata-Tesla: సెమీ కండక్టర్ల సరఫరా కోసం టాటా ఎలక్ట్రానిక్స్ తో టెస్లా ఒప్పందం టాటా
    Elon Musk-Tesla: 10శాతం పైగా కోతలుంటాయి: టెస్లా సంస్థ సీఈఓ ఎలన్ మస్క్ సంచలన ప్రకటన ఎలక్ట్రిక్ వాహనాలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025