NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / PM Modi: యూఏఈలో భారత్‌ మార్ట్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని .. భారత్‌కు ఇది ఎందుకు ముఖ్యమో తెలుసా? 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: యూఏఈలో భారత్‌ మార్ట్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని .. భారత్‌కు ఇది ఎందుకు ముఖ్యమో తెలుసా? 
    యూఏఈలో భారత్‌ మార్ట్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని ..

    PM Modi: యూఏఈలో భారత్‌ మార్ట్‌కు శంకుస్థాపన చేసిన ప్రధాని .. భారత్‌కు ఇది ఎందుకు ముఖ్యమో తెలుసా? 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 15, 2024
    02:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ, యూఏఈ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ బుధవారం భారత్ మార్ట్‌కు శంకుస్థాపన చేశారు.

    భారతదేశ సూక్ష్మ,చిన్న,మధ్యతరహా రంగాన్నిప్రోత్సహించడంలో భారత్ మార్ట్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

    దీని వల్ల లక్షలాది మంది లబ్ధి పొందనున్నారు.భారతదేశ సూక్ష్మ,చిన్న,మధ్యతరహా రంగాన్ని ప్రోత్సహించడంలో భారత్ మార్ట్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రధాని మోదీ అన్నారు.

    భారత్ మార్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో వ్యాపారం చేయడానికి వీలు కల్పించే నిల్వ సౌకర్యం.

    మొదట 2025 నాటికి కార్యకలాపాలు ప్రారంభించాలని భావించిన భారత్ మార్ట్ చైనా ప్రవేశపెట్టిన 'డ్రాగన్ మార్ట్' తరహాలో ఒకే పైకప్పు క్రింద వివిధ రకాల ఉత్పత్తులను ప్రదర్శించడానికి భారతీయ ఎగుమతిదారులకు ఏకీకృత వేదికను అందిస్తుంది.

    Details 

    భారత్ మార్ట్ భారతీయ వ్యాపారులకు ఎలా ప్రయోజనం చేకూరుస్తుంది? 

    భారత్ మార్ట్ ఆఫ్రికా, యూరప్,యుఎస్ వంటి ఇతర దేశాలతో వాణిజ్యం చేయడానికి భారతీయ ఎగుమతిదారులకు యుఎఇలో ఒక స్థావరాన్ని అందిస్తుంది.

    భారతదేశం ఈ సదుపాయంతో ఖర్చులను తగ్గించుకోవచ్చని,రవాణా కోసం వెచ్చించే సమయాన్ని కూడా తగ్గిస్తుంది.

    UAE ఆసియాలో ప్రధాన లాజిస్టిక్స్ హబ్‌గా ప్రసిద్ధి చెందింది. మధ్య ఆసియా ప్రాంతంలోకి ప్రవేశించాలనుకుంటున్న ఎగుమతిదారులు కూడా భారత్ మార్ట్ నుండి ప్రయోజనం పొందుతారు.

    భారత్ మార్ట్ ఎప్పుడు పని చేస్తుంది? భారత్ మార్ట్ 2025 నాటికి పని చేయవచ్చని భావిస్తున్నారు. ఇది భారతీయ కంపెనీలకు దుబాయ్‌లో వ్యాపారం చేయడానికి వీలు కల్పించే స్టోరేజీ సదుపాయం. ఇది చైనాకు చెందిన డ్రాగన్ మార్ట్‌తో పోటీపడనుంది.

    Details 

    భారత్ మార్ట్ రెండు దేశాలకు ఎందుకు ముఖ్యమైనది? 

    సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) కింద 2030 నాటికి తమ పెట్రోలియం యేతర వాణిజ్య లక్ష్యాన్ని $100 బిలియన్లకు రెట్టింపు చేసేందుకు భారతదేశం, UAE ప్రయత్నిస్తున్నాయి.

    రెండు దేశాలలో వాణిజ్య ప్రాతిపదికను స్థాపించడంలో ఇది చాలా ముఖ్యమైనదని ప్రధాని మోదీ అన్నారు.

    ఈ ప్రాజెక్ట్ ఆవిర్భావం ఏమిటంటే, చైనాలో కూడా ఇలాంటి సౌకర్యాలు ఉన్నాయి, ఇవి దాని ఎగుమతిదారులకు సహాయపడుతున్నాయి.

    Details 

    చైనాకు చెందిన డ్రాగన్‌మార్ట్‌ తరహాలో భారత్‌ మార్ట్‌ 

    దుబాయ్‌లో చైనా డ్రాగన్ మార్ట్‌ను నిర్మించింది. ఈ 1.2 కిలోమీటర్ల పొడవైన మార్ట్ దాని దేశం వెలుపల చైనా అతిపెద్ద రిటైల్ వాణిజ్య కేంద్రం.

    ఇదే తరహాలో భారత్‌ మార్ట్‌ను ప్రారంభిస్తోంది. DP వరల్డ్‌లోని పార్క్స్ అండ్ జోన్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అబ్దుల్లా అల్ హష్మీ మాట్లాడుతూ భారత్ మార్ట్ ప్రపంచవ్యాప్తంగా భారత్ తయారు చేసిన ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు ఒక మెగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌గా మారేందుకు సిద్ధంగా ఉందని అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025