LOADING...
Online Shopping: ఇంటర్నెట్ యూజర్లు 850 కోట్లు.. కానీ వారిలో 25శాతం మందే ఆన్‌లైన్‌లో షాపింగ్ 
ఇంటర్నెట్ యూజర్లు 850 కోట్లు.. కానీ వారిలో 25శాతం మందే ఆన్‌లైన్‌లో షాపింగ్

Online Shopping: ఇంటర్నెట్ యూజర్లు 850 కోట్లు.. కానీ వారిలో 25శాతం మందే ఆన్‌లైన్‌లో షాపింగ్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jul 28, 2025
03:09 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశంలో ఆన్‌లైన్‌ షాపింగ్‌ దూసుకెళ్తోంది. బయటకు వెళ్లే తంతు లేకుండానే డిజిటల్‌ వాణిజ్యంపై వినియోగదారుల మక్కువ పెరిగిపోతోంది. దీంతో నిత్యం ఆన్‌లైన్‌లో కొనుగోళ్లు చేసే వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే అమెరికా, చైనా వంటి దేశాలతో పోల్చుకుంటే భారత్‌ ఇంకా వెనుకబాటులోనే ఉన్నట్లు గ్లోబల్ కన్సల్టింగ్ సంస్థ 'మెకెన్సీ' తాజా నివేదిక వెల్లడించింది. దేశంలో 850 మిలియన్ల (85 కోట్ల) ఇంటర్నెట్‌ యూజర్లుండగానే, వారిలో కేవలం 20 నుంచి 25 శాతం మంది మాత్రమే ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోళ్లు చేస్తున్నారని మెకెన్సీ వివరించింది. ఇదే సమయంలో అమెరికా, చైనా వంటి దేశాల్లో ఇంటర్నెట్‌ వినియోగదారుల్లో 85 శాతం మంది ఆన్‌లైన్‌ షాపింగ్‌ చేస్తున్నట్టు తెలిపింది.

Details

వేగంగా విస్తరిస్తున్న ఈ కామర్స్ రంగం

ఇక భారత్‌లో కొన్ని సంవత్సరాలుగా ఈ కామర్స్‌ రంగం వేగంగా విస్తరిస్తోందని నివేదిక పేర్కొంది. వినియోగదారులు ఈ తరహా షాపింగ్ పద్ధతుల వైపు మరింతగా ఆకర్షితులవుతుండటమే కాకుండా క్విక్ కామర్స్ వేదికలు వంటి కొత్త ఆవిష్కరణలు రంగానికి నూతన దిశను చూపిస్తున్నాయనీ వెల్లడించింది. 2023 నాటికి దేశీయ రిటైల్ మార్కెట్లో ఈ కామర్స్ వాటా 7-9 శాతం ఉన్నదిగా అంచనా వేయగా, 2030 నాటికి ఇది రెట్టింపు అవుతుందన్న అంచనాలున్నాయి. దీంతో భారత ఆన్‌లైన్ షాపింగ్ రంగానికి గణనీయమైన వృద్ధి అవకాశాలు ఉన్నట్లు స్పష్టం అవుతోంది.