NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: మోస్తరు లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 182, నిఫ్టీ 88 పాయింట్లు చొప్పున లాభం 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market: మోస్తరు లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 182, నిఫ్టీ 88 పాయింట్లు చొప్పున లాభం 
    Stock market: మోస్తరు లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..

    Stock market: మోస్తరు లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 182, నిఫ్టీ 88 పాయింట్లు చొప్పున లాభం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 14, 2025
    04:31 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశీయ స్టాక్‌ మార్కెట్లు మంగళవారం మోస్తరుగా లాభాల‌తో ముగిశాయి.

    ప్రపంచ మార్కెట్ల నుండి వచ్చిన మిశ్రమ సంకేతాల ప్రభావంతో స్టాక్ సూచీలు పరిమిత స్థాయిలో లాభపడినప్పటికీ, కొన్ని రంగాల్లో స్టాక్స్‌ మంచి పనితీరును కనబరిచాయి.

    ముఖ్యంగా మెటల్స్‌, రియల్ ఎస్టేట్‌, టెక్నాలజీ రంగాల్లోని షేర్లు మదుపరులకు లాభాలు ఇచ్చాయి.

    భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతలు తగ్గడం, దేశీయంగా రిటైల్‌ ద్రవ్యోల్బణం తగ్గుదలతో భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ వడ్డీ రేట్లను తగ్గించవచ్చన్న అంచనాలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని పెంచాయి.

    దీంతో మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు 1 శాతం కంటే ఎక్కువ లాభాలను నమోదు చేశాయి.

    వివరాలు 

    రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చితే 85.27

    సెన్సెక్స్‌ ఉదయం 81,278.49 పాయింట్ల వద్ద లాభాలతో ప్రారంభమైంది,ఇది గత ముగింపు స్థాయైన 81,148.22 పాయింట్ల కంటే పైగా ఇంట్రాడే ట్రేడింగ్‌లో 80,910.03, 81,691.87 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను అనుభవించింది.

    చివరికి 182.34 పాయింట్ల లాభంతో 81,330.56 వద్ద ముగిసింది.నిఫ్టీ కూడా 88.55 పాయింట్లు పెరిగి 24,666.90 వద్ద స్థిరపడింది.

    రూపాయి మారకం విలువ డాలరుతో పోల్చితే 85.27 వద్ద నమోదైంది.

    వివరాలు 

    నష్టాలను నమోదు చేసిన షేర్లు ఇవే.. 

    సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, ఎటర్నల్‌, టెక్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ, మహీంద్రా అండ్‌ మహీంద్రా షేర్లు లాభపడిన ప్రధాన కంపెనీలుగా నిలిచాయి.

    మరోవైపు, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా మోటార్స్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ షేర్లు నష్టాలను నమోదు చేశాయి.

    అంతర్జాతీయ మార్కెట్ విషయానికి వస్తే, బ్రెంట్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 65.77 డాలర్ల వద్ద కొనసాగుతుండగా,బంగారం ఔన్సు ధర 3237 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Stock market: మోస్తరు లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 182, నిఫ్టీ 88 పాయింట్లు చొప్పున లాభం  స్టాక్ మార్కెట్
    Ashwini Vaishnaw: ఉత్తరప్రదేశ్‌లో ఆరో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ గ్రీన్‌ సిగ్నల్‌  ఉత్తర్‌ప్రదేశ్
    Mango: ప్రపంచంలోని టాప్ 20 మామిడి వంటకాలలో భారత్‌కు అగ్రస్థానం.. తయారీ విధానం కూడా చాలా సులువు! వేసవి కాలం
    Telangana: రైతులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్.. ఈ నెలాఖరులోగా ఖాతాల్లో నిధులు జమ తెలంగాణ

    స్టాక్ మార్కెట్

    Stock market: భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు.. సెన్సెక్స్‌ 1500 పాయింట్లు, నిఫ్టీ 414 పాయింట్లు బిజినెస్
    Stock Market: స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభం - బ్యాంకింగ్ షేర్లలో దూకుడు  బిజినెస్
    Stock Market : భారీ లాభాల్లో కొనసాగుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు.. సెన్సెక్స్‌ 1000 పాయింట్లు ప్లస్‌ బిజినెస్
    Stock Market : భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు సూచీలు.. సెన్సెక్స్‌ 855, నిఫ్టీ 273 పాయింట్లు చొప్పున లాభం  బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025