NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Palace on Wheels: 'ప్యాలెస్ ఆన్ వీల్స్' రైలు ప్రారంభం.. బుకింగ్ ప్రక్రియ, టిక్కెట్ ధరలు తెలుసుకోండి! 
    తదుపరి వార్తా కథనం
    Palace on Wheels: 'ప్యాలెస్ ఆన్ వీల్స్' రైలు ప్రారంభం.. బుకింగ్ ప్రక్రియ, టిక్కెట్ ధరలు తెలుసుకోండి! 
    'ప్యాలెస్ ఆన్ వీల్స్' రైలు ప్రారంభం.. బుకింగ్ ప్రక్రియ, టిక్కెట్ ధరలు తెలుసుకోండి!

    Palace on Wheels: 'ప్యాలెస్ ఆన్ వీల్స్' రైలు ప్రారంభం.. బుకింగ్ ప్రక్రియ, టిక్కెట్ ధరలు తెలుసుకోండి! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 25, 2024
    01:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    చాలామందికి రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం.. ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే వ్యవస్థ మన దేశంలోనే ఉంది.

    ఇక మనదేశంలో ఫైవ్ స్టార్ హోటల్స్ ను మించిన కొన్ని రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

    అందులో ఒకటి 'ప్యాలెస్ ఆన్ వీల్స్'. ఇందులో టికెట్ ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. రైలు లోపలి భాగం రాచరిక సంస్కృతి కనిపిస్తుంది.

    ఈ రైలును 1982లో ప్రారంభించారు. ప్యాలెస్ ఆన్ వీల్స్ రాజస్థాన్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా నడిచే మొదటి లగ్జరీ హెరిటేజ్ రైలు.

    Details

    8 రోజుల ప్రయాణం

    'ప్యాలెస్ ఆన్ వీల్స్' రైలు పింక్ సిటీ జైపూర్, గోల్డెన్ సిటీ జైసల్మేర్, జోధ్‌పూర్, ఉదయపూర్ వంటి ఐకానిక్ రాజస్థానీ నగరాలను కవర్ చేస్తుంది.

    మొత్తం 8 రోజుల పాటు సాగే ఈ రైలు ప్రయాణం దిల్లీ నుంచి ప్రారంభమవుతుంది.

    రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పర్యాటక ప్రాంతాలను ఈ రైలు కవర్ చేస్తుంది.

    దిల్లీ → జైపూర్ → సవాయి మాధోపూర్ → చిత్తోర్‌గఢ్ → ఉదయపూర్ → జైసల్మేర్ → జోధ్‌పూర్ → భరత్‌పూర్ → ఆగ్రా మీదుగా మొత్తం ఎనిమిది రోజులు ప్రయాణించి చివరికి దిల్లీకి చేరుకుంటుంది.

    'ప్యాలెస్ ఆన్ వీల్స్' టిక్కెట్ ధరలు డిమాండ్, ఆక్యుపెన్సీ ఆధారంగా మారుతుంటాయి.

    Details

    అధికారక వెబ్ సైట్ టికెట్ బుకింగ్

    అక్టోబర్ 2024 నుండి మార్చి 2025 వరకు ఈ రైలు సీజన్ ఉండటం వల్ల ధరలు కేటగిరీ ఆధారంగా వేరువేరుగా ఉంటాయి. ఈ రైలులో ప్రయాణించాలంటే సుమారు రూ.3,63,300 టికెట్ ధర ఉండనుంది.

    'ప్యాలెస్ ఆన్ వీల్స్' టిక్కెట్‌ను బుక్ చేసుకోవాలనుకుంటే, ప్యాలెస్ ఆన్ వీల్స్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి

    [https://www.thepalaceonwheels.org](https://www.thepalaceonwheels.org)

    1. వెబ్‌సైట్‌లోకి వెళ్లి టికెట్ బుకింగ్ సెక్షన్‌కి వెళ్లండి.

    2. బయలుదేరే తేదీలను ఎంచుకోండి.

    3. ప్రయాణికుల వివరాలను పూరించండి.

    4. ఇతర వివరాలను సమర్పించి, బుకింగ్ పూర్తిచేయండి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రయాణం
    వ్యాపారం

    తాజా

    Gayatri : ప్రముఖ గాయని కన్నుమూత అస్సాం/అసోం
    Dadasaheb Phalke: ఫాల్కే బయోపిక్‌పై క్లారిటీ.. రాజమౌళి కాదు, ఆమిర్‌ టీమ్‌ మాత్రమే సంప్రదించింది టాలీవుడ్
    Hyderabad Metro: నేటి నుంచి మెట్రో ఛార్జీల్లో పెంపు.. ప్రయాణికులకు అదనపు భారం మెట్రో స్టేషన్
    Operation Sindoor: 'ఆపరేషన్‌ సిందూర్‌' ప్రభావంతో మాకు నష్టం వాటిల్లింది.. అంగీకరించిన పాక్ ప్రధాని పాకిస్థాన్

    ప్రయాణం

    NOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు విమానం
    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు హిమాచల్ ప్రదేశ్
    ఎయిర్‌బస్, బోయింగ్‌ల సంస్థల నుంచి 500 జెట్‌లను ఆర్డర్‌ చేసిన ఎయిర్‌ ఇండియా విమానం
    IATA: భారత్‌లో గణనీయంగా పెరిగిన దేశీయ విమాన ప్రయాణాలు విమానం

    వ్యాపారం

    Salesforce: వారానికి 4 నుండి 5 రోజులు ఆఫీసుకు రావాల్సిందే.. ఉద్యోగులకు సేల్స్ ఫోర్స్ సమాచారం సాఫ్ట్ వేర్
    Google :రికార్డు సృష్టించిన గూగుల్ క్లౌడ్.. మొదటిసారి $10B ఆదాయం గూగుల్
    Crowdstrike: క్రౌడ్ స్ట్రైక్ వినియోగదారులకు ప్రభుత్వం హెచ్చరికలు టెక్నాలజీ
    Air India: ఎయిర్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకున్న హనీవెల్ ఎయిర్ ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025