LOADING...
India US Trade Deal: ట్రంప్‌ సుంకాలను తగ్గించడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా?
ట్రంప్‌ సుంకాలను తగ్గించడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా?

India US Trade Deal: ట్రంప్‌ సుంకాలను తగ్గించడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా?

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 03, 2026
09:35 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ భారత్‌పై విధించిన 25 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. అలాగే రష్యా నుండి చమురు కొనుగోలు పై విధించిన అదనపు 25 శాతం సుంకాలను కూడా తొలగించారు. ఈ పరిణామంతో భారత్‌పై మొత్తంగా 50 శాతం సుంకాలు 18 శాతానికి తగ్గాయి. ఇప్పటివరకు భారత్‌పై కఠినంగా వ్యవహరిస్తున్న ట్రంప్‌, ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఏమిటని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. ట్రంప్‌ సుంకాలను తగ్గించడానికి ప్రధాన కారణమయ్యే ఐదు అంశాలు ఇవే:

వివరాలు 

1. భారత్‌-EU ట్రేడ్ డీల్

భారత్‌-EU మధ్య "మదర్ ఆఫ్ ఆల్ డీల్స్"గా పిలువబడే వాణిజ్య ఒప్పందం, అమెరికా సుంకాల తగ్గింపుకు ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు. ఈ ఒప్పందం 2 బిలియన్ల జనాభా ఉన్న మార్కెట్‌ను ఏర్పరచిందని, ప్రపంచంలోని ఏ ఇతర ప్రధాన ఒప్పందంతో సరిపోలదని వారు చెబుతున్నారు. యూరప్‌ భారతీయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించడంతో, అమెరికా నుంచి భారత్‌కు వచ్చిన నష్టాలను సమానం చేసేలా ఇది పనిచేస్తుంది. ఫలితంగా భారత్‌పై సుంకాలను తగ్గించడం అమెరికాకు ఎక్కువ ఇబ్బంది రాదు అని భావించి, ట్రంప్‌ సానుకూలంగా స్పందించారు.

వివరాలు 

2. కెనడా-భారత్ యురేనియం ఒప్పందం

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కెనడాపై భారీ సుంకాలను విధిస్తానని బెదిరించిన సమయంలో, భారత్‌-కెనడా సంబంధాలు దగ్గరగా మారుతున్నాయి. ఇటీవల కార్నీ మార్చిలో భారత్‌ సందర్శించవచ్చని, నవంబర్ 2025 నుండి నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందంపై చర్చలు తిరిగి ప్రారంభించే అవకాశం ఉందని నివేదికలు వచ్చాయి. ముఖ్యంగా యురేనియం ఒప్పందం ద్వారా సుమారు రూ.25,000 కోట్ల (సుమారు 25 బిలియన్ USD) విలువైన వ్యాపారం జరుగుతుందని సూచిస్తున్నారు. భారత్‌ అనేక దక్షిణ అమెరికా దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు ప్రారంభించింది. చమురు సరఫరా కూడా కొనసాగుతోంది. ఈ పరిణామాలు అమెరికా అధ్యక్షుడి ఆందోళనను మరింత పెంచాయి.

Advertisement

వివరాలు 

3. అమెరికాను తాకిన ద్రవ్యోల్బణం

భారత్‌పై సుంకాలను తగ్గించడానికి ఒక కారణం అమెరికాలో ద్రవ్యోల్బణ స్థిరంగా ఉండటం. డిసెంబర్‌లో అమెరికా ద్రవ్యోల్బణం 2.7శాతంలో స్థిరంగా ఉంది.ప్రధాన వినియోగదారుల ధర సూచికలో మార్పు లేదు,ముఖ్యంగా అస్థిర ఆహారం,ఇంధన ధరలను మినహాయించి,ప్రధాన ద్రవ్యోల్బణం 2.6శాతం గా ఉంది. గృహ సంబంధ ధరలు 3.2 శాతం,ఆహార ద్రవ్యోల్బణం 3.1 శాతం గా ఉంది. ద్రవ్యోల్బణ స్థాయిలు వడ్డీ రేట్లను తగ్గించడం కష్టం చేస్తాయి. ఫెడరల్ రిజర్వ్ చీఫ్ జెరోమ్ పావెల్ ప్రస్తుత పరిస్థితులను బట్టి రేటు కోతకు ఎక్కువ సమయం పడవచ్చని చెప్పారు. కానీ భవిష్యత్తులో కొత్త చీఫ్ కెవిన్ వార్ష్ మళ్లీ కఠిన ద్రవ్య విధానం అనుసరిస్తారు. ఈ నేపథ్యంలో ట్రంప్ సుంకాలను తగ్గించడం ద్వారా భారత్‌తో సానుకూల సంబంధాలను కొనసాగిస్తున్నారు.

Advertisement

వివరాలు 

4. చైనా ఎగుమతులపై వాణిజ్య యుద్ధం

అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం కొత్తది కాదు. చైనా ఇటీవల విడుదల చేసిన ఎగుమతి గణాంకాలు, 2025 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎగుమతులు సాధించగలదని చూపించాయి. అమెరికా చైనాకు అధిక సుంకాలను విధించినప్పటికీ, చైనా ప్రపంచం వివిధ దేశాలలో సుంకాలను పెంచింది. ప్రపంచ సరఫరా గొలుసులో భారత్‌ ప్రధాన పాత్ర పోషించగల దేశంగా ఉంది. భారత ఉత్పత్తులను పొందడం, ముఖ్య ప్రపంచ దేశాల మద్దతు, యూరప్‌-భారత్‌ ఒప్పందం, అమెరికా కంపెనీల (ఆపిల్ వంటి) భారత ప్రాధాన్యతలపై దృష్టి, ఇలా కలిపి ట్రంప్‌ భారత్‌పై సుంకాలు తగ్గించడానికి సహకరించారంటున్నారు.

వివరాలు 

5. వెనిజులా చమురు అమ్మకాలు

అమెరికా వెనిజులా ముడి చమురును ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుండి, దానిని విక్రయించడం బాధ్యతగా మారింది. ట్రంప్‌ ఈ చమురు ఆదాయం అమెరికా ప్రజల సంక్షేమం, వృద్ధికి ఉపయోగిస్తారని హామీ ఇచ్చారు. అయితే ఎవరికి విక్రయించాలి అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. అందువల్ల, భారత్‌ రష్యా చమురు నుండి వెనిజులా చమురుకు మారాలని అమెరికా కోరుతోంది. ఈ అంశంపై రెండు దేశాల మధ్య ఏకాభిప్రాయం ఏర్పడినట్లు తెలుస్తోంది.

Advertisement