NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Vardhman: వర్ధమాన్ గ్రూప్ సీఈవో ఎస్పీ ఓస్వాల్‌ను మోసం చేసిన కేటుగాళ్లు.. ఇద్దరు అరెస్ట్
    తదుపరి వార్తా కథనం
    Vardhman: వర్ధమాన్ గ్రూప్ సీఈవో ఎస్పీ ఓస్వాల్‌ను మోసం చేసిన కేటుగాళ్లు.. ఇద్దరు అరెస్ట్
    వర్ధమాన్ గ్రూప్ సీఈవో ఎస్పీ ఓస్వాల్‌ను మోసం చేసిన కేటుగాళ్లు.. ఇద్దరు అరెస్ట్

    Vardhman: వర్ధమాన్ గ్రూప్ సీఈవో ఎస్పీ ఓస్వాల్‌ను మోసం చేసిన కేటుగాళ్లు.. ఇద్దరు అరెస్ట్

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 30, 2024
    11:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. ప్రతి రోజూ సరికొత్త మార్గాల్లో ప్రజలను మోసం చేస్తున్నారు.

    ఈ కేటుగాళ్లు వివిధ రూపాల్లో మోసానికి పాల్పడి వందల నుంచి వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు.

    కష్టపడి సంపాదించిన సంపదను కాపాడుకోవడం చాలా ముఖ్యం, అయితే సైబర్ నేరాల పెరుగుదల కారణంగా ఇది కష్టంగా మారుతోంది.

    నేరగాళ్లు సామాన్య ప్రజలనే కాకుండా ప్రముఖులను కూడా టార్గెట్ చేస్తున్నారు.

    తాజాగా, ప్రముఖ పారిశ్రామికవేత్త, వర్ధమాన్ గ్రూప్ యజమాని ఎస్పీ ఓస్వాల్ సైబర్ మోసానికి గురయ్యారు.

    ఓ అంతర్-రాష్ట్ర సైబర్ ముఠా వర్ధమాన్ గ్రూప్ సీఈవో శ్రీ పాల్ ఓస్వాల్‌ను రూ. 7 కోట్ల మేర మోసం చేసింది. వీరిని పంజాబ్ పోలీసులు ఇటీవల పట్టుకున్నారు.

    వివరాలు 

    48 గంటల్లో కేసును ఛేదించారు

    లూధియానా పోలీస్ కమిషనర్ కుల్దీప్ సింగ్ చాహల్ ప్రకారం,ఇద్దరు సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ. 5.25 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.

    ఈ ముఠాలోని మరో ఏడుగురిని గుర్తించామని,వారిని పట్టుకునేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, వీరంతా అస్సాం, పశ్చిమ బెంగాల్‌కు చెందినవారని తెలిపారు.

    ఈ సైబర్ మోసం ఎలా జరిగింది అంటే, నిందితులు పారిశ్రామికవేత్తకు నకిలీ సీబీఐ అధికారులుగా పరిచయం చేసుకొని,వాడిన బోగస్ అరెస్ట్ వారెంట్లతో బెదిరించి, డిజిటల్ రూపంలో అరెస్ట్ చేస్తామంటూ బెదిరించారు.

    ఓస్వాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా, సైబర్ సెల్ పోలీసులు చర్యలు తీసుకుని 48 గంటల్లో కేసును ఛేదించారు.

    నిందితులైన అటానూ చౌదరి, ఆనంద్ కుమార్ చౌదరి అనే ఇద్దరు అస్సాంలోని గౌహటి నివాసితులని గుర్తించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సైబర్ నేరం
    పంజాబ్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    సైబర్ నేరం

    2022 లో క్రిప్టో, మాల్వేర్ దాడులు వంటి సైబర్ నేరాల పెరుగుదల క్రిప్టో కరెన్సీ
    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో వాయిస్ స్కామ్‌లు; తస్మాత్ జాగ్రత్త  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి

    పంజాబ్

    BSF: 2023లో పాకిస్థాన్ సరిహద్దులో 100 డ్రోన్‌లను కూల్చివేసిన బీఎస్ఎఫ్ పాకిస్థాన్
    Dense Fog: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి  దిల్లీ
    Family suicide: ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య.. కారణం ఇదే..  ఆత్మహత్య
    Truck, bus drivers protest : దేశవ్యాప్తంగా డ్రైవర్లు సమ్మె.. హైవేలు దిగ్బంధనం.. పెట్రోల్ బంకులకు పోటెత్తిన జనం  కేంద్ర ప్రభుత్వం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025