NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Krishna Chivukula: ఐఐటీ-మద్రాస్‌కు రూ.228 కోట్లు విరాళంగా ఇచ్చిన కృష్ణ చివుకుల ఎవరు?
    తదుపరి వార్తా కథనం
    Krishna Chivukula: ఐఐటీ-మద్రాస్‌కు రూ.228 కోట్లు విరాళంగా ఇచ్చిన కృష్ణ చివుకుల ఎవరు?
    ఐఐటీ-మద్రాస్‌కు రూ.228 కోట్లు విరాళంగా ఇచ్చిన కృష్ణ చివుకుల ఎవరు?

    Krishna Chivukula: ఐఐటీ-మద్రాస్‌కు రూ.228 కోట్లు విరాళంగా ఇచ్చిన కృష్ణ చివుకుల ఎవరు?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Aug 07, 2024
    11:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    అమెరికా, బెంగళూరుల్లో కార్పొరేట్‌ సంస్థలు నెలకొల్పి, ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న తెలుగు తేజం కృష్ణ చివుకుల తన ఉదారతను చాటుకున్నారు.

    తాజాగా తాను ఇంజినీరింగ్‌ విద్యనభ్యసించిన ఐఐటీ మద్రాస్‌కు రూ. 228 కోట్ల భారీ విరాళం ప్రకటించారు.

    ఇది భారతదేశంలోని ఏదైనా విద్యా సంస్థకు అందించిన అతిపెద్ద విరాళం. విద్యార్థులు, ప్రముఖ క్రీడాకారులు, విదేశీ విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్‌లకు ఫెలోషిప్‌లు అందించడానికి, పత్రికను తీసుకురావడానికి ఈ మొత్తం ఉపయోగించబడుతుంది.

    చివుకుల ఇండో MIM టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు. IIT-మద్రాస్‌లో చదువుకున్న భారతీయ పారిశ్రామికవేత్త.

    వివరాలు 

    చివుకుల విద్యాబ్యాసం 

    చివుకుల 8వ తరగతి వరకు తెలుగు మీడియంల చదువుకున్నాడు. ఆ తర్వాత బీటెక్ పూర్తి చేసి, ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ డిగ్రీ చేసేందుకు ఐఐటీ-మద్రాస్‌లో చేరాడు.

    ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత అమెరికా వెళ్లి అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీలో చేరి 1980లో ఎంబీఏ పూర్తి చేశారు.

    చదువు పూర్తయ్యాక 2 కంపెనీలను స్థాపించాడు.

    వివరాలు 

    చివుకుల ఈ కంపెనీలను స్థాపించారు 

    చివుకుల 1990లో న్యూయార్క్‌లోని సిరక్యూస్‌లో శివ టెక్నాలజీస్ ఇంక్‌ని స్థాపించారు. అల్ట్రా-హై ప్యూరిటీ మెటీరియల్‌లను ప్రామాణీకరించడానికి అధునాతన మాస్ స్పెక్ట్రోస్కోపీలో కంపెనీ ప్రత్యేకత కలిగి ఉంది.

    అదనంగా, అయన బెంగళూరులో ఇండో MIM కంపెనీని కూడా స్థాపించాడు, ఇది అధిక వాల్యూమ్ జ్యామితితో చిన్న మెటల్ , సిరామిక్ భాగాలను ఉత్పత్తి చేస్తుంది.

    2020లో చివుకుల మొత్తం సంపద రూ.6,800 కోట్లు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025