NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Stock market: ఆపరేషన్‌ సిందూర్‌.. కుదేలైన పాక్‌ మార్కెట్‌.. మన మార్కెట్లు కూల్ 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Stock market: ఆపరేషన్‌ సిందూర్‌.. కుదేలైన పాక్‌ మార్కెట్‌.. మన మార్కెట్లు కూల్ 
    ఆపరేషన్‌ సిందూర్‌.. కుదేలైన పాక్‌ మార్కెట్‌.. మన మార్కెట్లు కూల్

    Stock market: ఆపరేషన్‌ సిందూర్‌.. కుదేలైన పాక్‌ మార్కెట్‌.. మన మార్కెట్లు కూల్ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 07, 2025
    02:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌' నేపథ్యంలో, మన స్టాక్ మార్కెట్‌పై ఎటువంటి పెద్ద ప్రభావం కనిపించలేదు.

    ప్రీ-మార్కెట్‌ సమయంలో కొద్దిగా ఊగిసలాట కనిపించినప్పటికీ, మార్కెట్‌ ప్రారంభమైన తరువాత తీవ్ర ప్రభావం లేకుండా స్థిరంగా కొనసాగింది.

    ప్రస్తుతం మార్కెట్లు సమతూల స్థాయిలో కదులుతున్నాయి.

    అయితే, పాకిస్థాన్ స్టాక్ మార్కెట్‌లో మాత్రం గణనీయమైన పతనం చోటుచేసుకుంది. భారత భద్రతా దళాల దాడులు అక్కడి స్టాక్ మార్కెట్‌ను బలంగా కుదిపేశాయి.

    వివరాలు 

    నిఫ్టీ 5 పాయింట్ల నష్టంతో 24,370 వద్ద స్థిరంగా ఉంది

    సెన్సెక్స్ ఉదయం 79,948.80 పాయింట్ల వద్ద నష్టాలతో ప్రారంభమైంది. కానీ త్వరలోనే పునరుద్ధరణ సాధించి, 80,844.63 పాయింట్ల వరకు పెరిగింది.

    మధ్యాహ్నం ఒక గంట సమయానికి ఇది 30 పాయింట్ల నష్టంతో 80,610 వద్ద ట్రేడవుతోంది.

    నిఫ్టీ కూడా 5 పాయింట్ల నష్టంతో 24,370 వద్ద స్థిరంగా ఉంది. గత 14 రోజుల కాలంలో విదేశీ సంస్థాగత మదుపుదారులు సుమారు ₹43,940 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.

    అలాగే, డాలర్ బలహీనత, అమెరికా, చైనాల్లో ఆర్థిక వృద్ధి మందగతం, క్రూడ్ ఆయిల్ ధరల తగ్గుదల వంటి అనుకూల పరిస్థితుల నేపథ్యంలో, భారత దాడిని మదుపుదారులు పెద్దగా పట్టించుకోలేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

    వివరాలు 

    సూచిక 3.7 శాతం నష్టపోయింది

    ఇక మరోవైపు, 'ఆపరేషన్‌ సిందూర్‌' పేరిట భారత భద్రతా బలగాలు పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో చేసిన దాడులు పాక్ మార్కెట్‌ను తీవ్రంగా దెబ్బతీశాయి.

    కరాచీ-100 సూచిక ప్రారంభంలోనే సుమారు 5.5 శాతం పతనమై 6,272 పాయింట్లు కోల్పోయి 1,07,296 పాయింట్ల వద్దకు చేరుకుంది.

    పహల్గాం దాడి అనంతరం భారత్‌ ప్రతిస్పందన ఇస్తుందన్న అంచనాలతో ఇప్పటికే ఆ సూచిక 3.7 శాతం నష్టపోయింది. తాజా దాడి ఆ మార్కెట్‌కు మరో భారీ షాక్‌ ఇచ్చింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్టాక్ మార్కెట్

    తాజా

    Stock market: ఆపరేషన్‌ సిందూర్‌.. కుదేలైన పాక్‌ మార్కెట్‌.. మన మార్కెట్లు కూల్  స్టాక్ మార్కెట్
    Travel Advisory: ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో.. పాకిస్థాన్ లోని తమ పౌరులకు అమెరికా,యుకె, చైనా అడ్వైజరీ ఆపరేషన్‌ సిందూర్‌
    BCCI: భారత్‌ - పాకిస్థాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు.. ఐపీఎల్‌కు ఎలాంటి ఆటంకం లేదన్న బీసీసీఐ..!  బీసీసీఐ
    Tollywood: చిరంజీవితో తీద్దామనుకుని.. చివరకు వెంకటేష్‌తో చిత్రీకరణ - కృష్ణంరాజు కేసుతో డిజాస్టర్  టాలీవుడ్

    స్టాక్ మార్కెట్

    Stock Market: 1,600 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్.. 22,600 పైన పెరిగిన నిఫ్టీ..  బిజినెస్
    Stock market:భారీ లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు..  1000 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్‌ బిజినెస్
    Asian Share Market: అమెరికా-చైనా టారిఫ్ యుద్ధం ప్రభావం.. భారీ నష్టాల్లో ఆసియా మార్కెట్లు! అమెరికా
    Stock market: దెబ్బతీసిన ట్రంప్‌ ప్రకటన.. నష్టాల్లో స్టాక్‌ మార్కెట్ సూచీలు బిజినెస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025