NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే
    తదుపరి వార్తా కథనం
    పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే
    పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే

    పీఎఫ్ ఖాతాదారులకు అలెర్ట్.. ఈ-నామినేషన్ లేకుంటే రూ.7 లక్షలు గల్లంతే

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 16, 2023
    04:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈపీఎఫ్ఓ అందించే ఈడీఎల్‌ఐ పథకం క్లెయిమ్ ప్రక్రియలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉద్యోగికి యాజమాన్యం అందించే అధిక మొత్తం దక్కాలంటే ఈ- నామినేషన్‌ ను తప్పనిసరి చేసింది.

    ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)లో మూడు పథకాలున్నాయి.

    1. ఎంప్లాయి ప్రావిడెంట్‌ ఫండ్‌,

    2. పెన్షన్‌ స్కీమ్‌ 1995 (ఈపీఎస్‌),

    3. ఎంప్లాయి డిపాజిట్‌ లింక్డ్‌ ఇన్సూరెన్స్‌ (ఈడీఎల్‌ఐ) స్కీమ్‌లు ఖాతాదారులకు అందుబాటులో ఉన్నాయి.

    వీటిలో ఈడీఎల్‌ఐ పథకానికి సంబంధించి కీలక మార్పులను సూచించింది. ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) ఖాతాదారులు చనిపోతే సదరు ఉద్యోగి సూచించిన నామినీకి 7 లక్షల రూపాయల మేర ప్రయోజనాల్ని అందిస్తోంది. ఆయా డబ్బులు పొందాలంటే ఈ- నామినేషన్‌‌ను సంస్థ తప్పనిసరి చేసింది.

    DETAILS

    ఏదైనా సంస్థలో ఒక సంవత్సరం పని చేస్తేనే స్కీమ్‌కి అర్హత

    ఉద్యోగి మరణిస్తే బాధిత కుటుంబీకులకు బీమా రక్షణ ప్రయోజనాల్లో ఈడీఎల్‌ఐ ఒకటని ఎంప్లాయీ బెనిఫిట్స్ ప్రాక్టీస్ అండ్ ఇంటర్నేషనల్ బిజినెస్ తెలిపింది.

    ఈపీఎఫ్ చట్టం 1952 మేరకు లిస్ట్ అయిన అన్నీ కంపెనీలు డిఫాల్ట్‌గా ఈడీఎల్‌ఐలో నమోదు చేసుకుంటాయని పేర్కొంది.

    ఈపీఎస్‌, ఈపీఎఫ్‌ స్కీమ్‌ల్లో భాగంగా కొంత మొత్తాన్ని ఉద్యోగే చెల్లిస్తారు. కానీ ఈడీఎల్‌ఐలో అలా ఉండదు. ఉద్యోగి తరఫున యాజమాన్యం చెల్లింపులు చేస్తుంది.

    అయితే సదరు బెనిఫిట్ పొందాలంటే మాత్రం ఉద్యోగులు ఏదైనా సంస్థలో ఒక సంవత్సరం పని చేస్తేనే స్కీమ్‌కు అర్హత సాధిస్తారు.

    ఉద్యోగి అకాల మరణంతో నామినీలు పీఎఫ్‌, పెన్షన్ విత్‌ డ్రాయిల్‌, ఈడీఎల్‌ఐలను తప్పక క్లెయిమ్ చేయాలి.

    ప్రక్రియలో భాగంగా వివిధ ధృవీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పెన్షన్

    తాజా

    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ
    Gill-Harthik: ఎలిమినేటర్‌ మ్యాచులో గిల్, హర్థిక్ మధ్య గొడవ.. 'శుభూ బేబీ' అంటూ క్లారిటీ! శుభమన్ గిల్

    పెన్షన్

    అధిక పెన్షన్ దరఖాస్తు గడువును పొడిగించిన EPFO భారతదేశం
    యాక్టివ్ ఉద్యోగుల కంటే పెన్షనర్ల సంఖ్య ఎక్కువ: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జితేంద్ర సింగ్
    ఈపీఎఫ్ అధిక పింఛనదారుల్లో ఆందోళన; ఉమ్మడి ఆప్షన్‌పై ఆధారాలు సమర్పించాలని ఈపీఎఫ్‌వో నోటీసులు ఉద్యోగులు
    ఈపీఎఫ్ అధిక పెన్షన్ దరఖాస్తు గడువు జూన్ 26వరకు పొడిగింపు  ఇండియా లేటెస్ట్ న్యూస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025