Operation Valentine: రేపు పుల్వామా స్మారక ప్రదేశాన్ని సందర్శించనున్న ఆపరేషన్ వాలెంటైన్ బృందం
2019 పుల్వామా దాడితో దేశం ఒక్కసారి ఉలిక్కి పడింది.ఈ ఘటనతో ఒకేసారి 40 మంది జవాన్లను దేశం దూరం చేసుకుంది. ఈ సంఘటన జరిగి రేపటికి 5 సంవత్సరాలు.ఈ సందర్భంగా వరుణ్ తేజ్ నటిస్తున్న ఆపరేషన్ వాలెంటైన్ సినిమా టీమ్ అమరవీరులకు నివాళులర్పించాలని నిర్ణయించుకుంది. ఈ దాడిలో వీరమరణం పొందిన అమరజవాన్లకు నివాళ్లు అర్పించడం కోసం,ఆపరేషన్ వాలెంటైన్ బృందం రేపు వారికి నివాళులర్పించేందుకు పుల్వామా స్మారక ప్రదేశాన్నిసందర్శించాలని నిర్ణయించింది. వీరి పర్యటనకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. వరుణ్ తేజ్,మానుషి చిల్లర్ జంటగా నటించిన ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించారు. ఆపరేషన్ వాలెంటైన్ కి మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జె మేయర్ .