
PV Narasimha Rao : వెబ్సిరీస్గా మాజీ ప్రధాని బయోపిక్.. త్వరలో ఆహాలో ప్రసారం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీవీ నరసింహారావుకు దేశ అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో దివంగత ప్రధాని పివి నరసింహారావు వారసత్వాన్ని తెరపై చిరస్థాయిగా నిలిపేందుకు ఆహా స్టూడియోస్,అప్లాజ్ ఎంటర్టైన్మెంట్ పీవీ నరసింహారావు బయోపిక్ 'హాఫ్ లయన్'ను తెరకెక్కిస్తున్నట్లు గతంలోనే ప్రకటించాయి.
ఈ సిరీస్ ను ప్రముఖ చిత్రనిర్మాత ప్రకాష్ ఝా నిపుణుల మార్గదర్శకత్వంలో రూపొందించబడింది.
Details
హిందీ..తెలుగు భాషల్లో విడుదల
న్యాయవాదిగా, రాజనీతిజ్ఞుడిగా, రాజకీయ వేత్తగా బహుముఖ పాత్రలు పోషించిన ప్రముఖ వ్యక్తి PV నరసింహారావు, 1991 నుండి 1996 వరకు భారతదేశాన్ని 9వ ప్రధానమంత్రిగా నడిపించారు.
పి.వి.నరసింహారావు నాయకత్వం, దూరదృష్టి భారతదేశ సామాజిక-ఆర్థిక నిర్మాణంపై చెరగని ముద్ర వేసింది.
ఈ పాన్ ఇండియా సిరీస్ ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, హిందీ..తెలుగు భాషల్లో విడుదల చేయబోతున్నామని దర్శకుడు తెలిపారు.
ఈ సిరీస్కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలో వెల్లడించబోతున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఆహా చేసిన ట్వీట్
Honouring the unparalleled legacy of the late PM, P.V. Narasimha Rao, Bharat Ratna awardee and the driving force behind India’s economic revolution.
— ahavideoin (@ahavideoIN) February 28, 2024
Aha Studio and Applause Entertainment are proud and excited to bring his story to the audience.@ApplauseSocial @ahavideoIN… pic.twitter.com/cUj3UEe9zs