తదుపరి వార్తా కథనం
Nagarjuna: పార్లమెంట్లో ప్రధాని మోదీతో భేటీ అయిన అక్కినేని కుటుంబం
వ్రాసిన వారు
Jayachandra Akuri
Feb 07, 2025
04:59 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీని శుక్రవారం అక్కినేని కుటుంబం పార్లమెంట్లో కలిసింది.
ఇటీవల జరిగిన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు గురించి ప్రధాని మోదీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రధాని మోదీకి సినీ నటుడు నాగార్జున కృతజ్ఞతలు తెలిపారు.
అంతేకాదు అక్కినేని నాగేశ్వరరావు జీవిత చరిత్రను ప్రధాని మోదీ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
ప్రధాని మోదీని కలిసిన వారిలో అక్కినేని కుటుంబ సభ్యులు, మాజీ ఎంపీ ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పాల్గొన్నారు.
ఈ భేటీకి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.